పుట:Sukavi-Manoranjanamu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భీష్మపర్వము (1-93)
క.

కొడుకులు దానును గుఱ్ఱపు
దళములు కరిఘటలు భట రథ వ్రాతములుం
బుడమి చలింపఁగ ద్రుపదుఁడు
గడు వేడుకఁ దోడుసూపె కౌరవ్యునకున్.

283

—అని లడలకు, ళడలకు, లక్ష్యములు వ్రాసినారు. అచ్చు పుస్తకములందు,
'జడనిధి'—'దడములు' అని వ్రాసినారు కవిత్వ మచ్చుపుస్తకములందున్నటులనే
సుష్ఠువు, అప్పకవిగారి మత మదికాదు. 'జలనిధి' - 'దళములు' అని నిశ్చయము.
అటులనే కాకపోతే లక్షణ లక్ష్యములకు విరోధము. నిశ్చయించుట అప్పకవి
గారిదిన్ని, వ్రాసుట అచ్చువేసిన వారిదిన్ని పొరపాటు.284

నైషధము (4-24)
చ.

చిలుకలు కూయునో చెవులు చిల్లులువోవఁగ నంచు నెన్నడున్
వెడలఁడు నందనోపనన వీథులకై యట, మౌలిభాగ ని
ర్మల శశిరేఖచేయు నపరాధమునన్ గజదైత్యశాసనున్
గొలువఁడు పాకశాసనుఁడు కోమలి నీదెసఁ గూర్కియెట్టిదో.

285
కూర్మపురాణము
తోటక.

తాలిమి దూలిన తాపసపత్నుల్
వ్రీడ మనంబున వీడ్కొని జాఱున్
లోల మదాలస లోచన పఙ్తుల్
జాల దలర్చిరి శంకరులీలన్.

286
అని (అప్పకవిగారు) వ్రాసినారు

     (అయితే) తిమ్మకవి సార్వభౌముడుగారు లక్షణసారసంగ్రహము
నందు (2-82)

క.

లడలకు నభేద మనుచున్
వెడఁగులు గడు ప్రాసములను విశ్రమముల ను
బ్బడరఁగఁ గలుపుదు రది యె
య్యెడలను సౌష్ఠవముగాదు హిమకరమకుటా!

287