పుట:Sukavi-Manoranjanamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఇది సంయుతా సంయుత ప్రాసమంటారు.227
(అయితే) కాకునూరి అప్పకవిగారు 'ఆంధ్రశబ్దచింతామణి'యందు :
గీ.

రలలు తమక్రింద జడ్డలై గ్రాలు వ్రాలు
ప్రాసవర్ణంబులై వానిఁ బాసియైన
గూడియైననుఁ బెఱయడుగులను నిలుచు
నవని సంయుతాసంయుతప్రాస మనఁగ.

228


గీ.

పాఁడి ద్రచ్చఁగనిమ్ము నా తండ్రి కృష్ణ
వేఁడుకొనియెద నందాక పండ్లు దినుము
దుండగపుచేష్టలును నోటి గాంద్రతనము
మెండుగాజొచ్చె నీకు నైదేండ్ల కనఁగ. (3-314, 315)

229

       —అని లక్షణము చెప్పినారు. ఇందులో, 'దుండ-గాండ్ర' - ఇది
మాత్రము బాగున్నది. 'వేడు - పండ్లు' ఇది మంచిదిగాదు. 'పాడి - తండ్రి'
'పాండి' అని పదమునందు బిందువులేదు. తండ్రి బిందువున్నది. ప్రాస
మెక్కడ నుండదు. అర్ధబిందుప్రాసముకు భారతాది లక్ష్యము లనేకములు,
పనిలేనిది వ్రాసిరి. అర్ధబిందు వున్నదానికి, లేనిదానికి సాధారణముగా ప్రాస
ములు గలవు. "మేండు - ఏండ్లు', ఎక్కడను లకారమున్నదానికి, లేనిదానికి
ప్రాసములేదు. 'మెండు' బిందువు. 'ఏఁడ్లు' అర్ధబిందువు. బిందువుకు నర్ధ
బిందువుకు (ప్రాసము)లేదు. రెండు పొరపాటులు కౢప్తపదమందున్న ఌకారమును
లకార మనుకొని భ్రాంతత్వమొంది యీ లక్ష్యము వ్రాసినారు. ఇది యనగా 230

లకార శ్లిష్టమునకు రాఘవపాండవీయము (1 - 3)
శా.

లోకత్రాణరతిం దదాదిమ మహీలోక ప్రవేశోత్క భా
షాకౢప్త ప్రథమ ద్వితీయ పదగుంజ న్మంజుమంజీరగ
ర్జాకల్పామల రామభారతకథాసర్గంబులన్ మించు వా
ల్మీకి వ్యాసులఁ గొల్చెదన్ దదుభయశ్లేషార్థసంసిద్ధికిన్.

231