పుట:Sukavi-Manoranjanamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

       ఇందులో "ప్రాణ" పదముకేగాని, మిగిలిన పదములకు చెల్లవనిన్ని,
మూఁడు వర్ణము లనిన్ని — యీ భేదములు స్పష్టమై యున్నవి.197

మధుసేనము
క.

పో నుద్యోగము చేసిన
ప్రాణంబా! యింక నీకు పాథేయంబా
మానిని మందస్మితమధు
రాసనచంద్రికలు గ్రోలి యరుగుము పిదపన్.

198

       —ఇటువంటివి ప్రాణపదములున్నవి మాత్రమే లక్ష్యములు వ్రాసినారు.
వారివారిమతానుసారముగా చెప్పినారేకాని, పూర్వ మహాకవి లక్ష్యములు పరిశీ
లించలేదు. శ్రీనాథాది మహాకవుల ప్రయోగము లేమనికొనిరో తెలియదు.
అప్పకవిగారు కాశీఖండమందలి 'క. త్రిణయనుని రాణివాసము' (2-150)
అను పద్యము (లక్ష్యము) వ్రాసినారు. త్రిశబ్దము రేఫయుక్త మయినది
గనుక 'నయన' శబ్దమును (ఆది నకారముకు) ణత్వమనుకున్నారు. త్రినయన,
త్రినేత్ర పదములకు వికల్పముననైనా శాబ్దికులు ణత్వము లేదన్నారు. ణత్వము
ఏకపదముందున్నది.199

'రషాభ్యాం నోణ స్సమానపదే'

       ఈ సూత్రముచేత కృపణః, భ్రూణః, రమణః, వారణః, భూషణం.
దూషణం——ఇత్యాది (ఏర్పడును). భిన్నపదములైనను సంజ్ఞయందు ణత్వం
నిత్యం.

'పూర్వపదాత్సంజ్ఞాయా మగః'

       నారాయణః, రామాయణం, చాంద్రాయణం (వ్రతవిశేషం),
అగః కిం? ఋగయనం. అసంజ్ఞయందు ణత్వము రాదు. రఘునాథః,
త్రినేత్రః, త్రినయనః, రామనామ ఇత్యాది.

       అసంజ్ఞయందు, సంజ్ఞయందు నిత్యముగా ణత్వమువచ్చెడు సూత్రము—
'ప్రనిరంతర శ్శరేక్ష ప్లక్షామ కార్ష్య ఖదిర పీయూక్షాభ్యో- సంజ్ఞాయా మపి'