పుట:Sukavi-Manoranjanamu.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
శ్రీనాథుని కాశీఖండము (2-150)
క.

త్రినయనుని రాణివాసము
నణిమాద్వైశ్వర్యవితరణామరతరువున్
మణికర్ణిక ముక్తి వధూ
మణికర్ణికఁ దలఁచుఁ దపసి మానసవీథిన్.

191

       నణలకు సాధారణముగా ప్రాసము చెల్లుచుండగా, అప్పకవి మొదలయిన
(వారి) మతములు వేరువేరై యున్నవి.192

కాకునూరి అప్పకవి “ఆంధ్రశబ్దచింతామణి' (3-328)
గీ.

'ధాత్రిఁ బాణినీయ సూత్రములను దృతీ
యోష్మమును ద్రుతంబు నొక్కచోట
క్రమత షాక్షరము ణకారమునై ప్రాస
ములకు నుభయసంజ్ఞ బొసఁగ రెండు'

193

       అనగా—నకారమునకు వచ్చిన ఇత్వము, సకారమునకు వచ్చిన
షత్వము నణలకున్ను, సషలకున్ను క్రమముగా చెల్లునని అప్పకవిగారి
తాత్పర్యము.194

రంగరాట్ఛందము (3-35)
గీ.

"ప్రాదియైన నకార శబ్దములు మూఁటి
కొక నకారంబు, రేపు సంయుక్తమగు న
కార మొకటుండి మూఁడు ణకారములును
బ్రాసములు చెందు నానందరంగధీర!"

195
అనంతుని ఛందము— (1-48)
గీ.

 ప్రాదియైయన శబ్దంబు ప్రాణమగుట,
బరగ నణలకు వేర్వేఱఁ బ్రాసమయ్యె
(క్షోణిధరుఁ డెత్తె నేనుఁగు ప్రాణమనఁగ
దానవారాశి వ్రేతల ప్రాణమనఁగ)

196