పుట:Sukavi-Manoranjanamu.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


'డోలా భూషోత్తరీయాణి వినైత్వం నాస్తి మధ్యయే'

ఇతి పృథగెత్వం విహితమేవ, అప్పకవిస్తు పయ్యెద ఇత్యాదౌ అచ్త్వం యశ్రుతి
త్వం చాహ. ఏతత్సూత్ర ప్రామాణ్యాత్ స్వకపోలకల్పితమేవే త్యనుసంధేయం
                                                  (క. శి. భూ. పు. 190)

       అనగా— ఉయ్యెల, తాయెతులు, పయ్యెద— ఈ మూడు పదములు
వినాగా మిగిలిన పదమధ్యయకారములకు తలకట్టులనిన్ని వీటికి మాత్ర మెత్వము
లనిన్నీ అథర్వణాచార్యుల వారి కారిక యున్నది గావున, నప్పకవి చేసిన పద
ద్వయవిభాగము స్వకపోలకల్పితమని అప్పకవిగారి మతమును (అహోబల
పతి) పరిహరించినారు.137

వసుచరిత్ర వ్యాఖ్యయందు సోమనాథ పండితులు వ్రాసిన గ్రంథము
సీ.

ఎదలపైఁ బొదవలు పయ్యెదలు జాఱగఁ బాఱు
బిబ్బీలకు ముసుంగు లబ్బఁజేసె.......

       దీని వ్యాఖ్యయందు అహోబలపండితులవారి గ్రంథమును వ్రాసి ఇందు
చేతనే (పయ్యెద) ఏక పదమనియున్ను, పద మధ్య యకార మెత్వయుక్త మని
యున్ను గ్రహించవలెనని వ్రాసినారు.138

       అప్పకవిగారి ఆంధ్రశబ్దచింతామణి అచ్చు పుస్తకములందు 'అద్యః
క్రియాసు భూతాద్యర్థ సముద్యోతిత మాద్యగం వినా సర్వః' అని యున్నది. అది
అచ్చువేసినవారి పాండిత్యము. ఆర్యావృత్త లక్షణ భంగమైనది.[1] కనినారు
కాదు అర్థవిమర్శ లేకపోయినది.139

  1. ఆర్యాపూర్వార్ధమందు ఏడు చతుర్మాత్రాగణములు మరియు వొక
    గురువుండవలెను. ఇందు ఒక చతుర్మాత్రాగణ మెక్కవైనది. "అద్యః ।
    క్రియాసు। భూతా । ద్యర్థన ।ముద్యో । తితమా । ద్యగంవి । నాస । ర్వః" ఇది
    ఆర్యాగీతియు కాదు. ఆర్యాగీతియం దెనిమిదిమాత్రమే చతుర్మాత్రాగణ
    ములుండును. ఇందొక గురువెక్కువ. మరియు 'ఆద్యగ' మని యుండుట అప్ప
    కవి ఉద్దేశ్యమునకు భిన్నముగూడ.