పుట:Sukavi-Manoranjanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నిప్పు డీవంకఁ గనుగొంటి నింతలోన
నెచ్చటికి నేగెద వన నాద్యచ్చు లయ్యెఁ
గయ్యమయ్యెను గానిమ్ము గాయకమున
గాయవలె శౌరి ననఁ దలకట్టు లయ్యె. (2-175)


సీ.

ఎక్కడ గనబడియెడు చక్రి చెలులార
             యింక నెవ్వరు చని యెదరు వెదుక
నీ వేళ నెటకుఁ బోయెదవన్న మిన్నక
             నేగెద నన్నే మనియెదరు మీరు
హేమాంగదము లిడియెదఁ జెప్పరే వాని
             నేరీతిఁ బొడగనియెదము మనము
హితము దలంప డాయెను నన్నుఁ గని నగి
             యెడు సవతుల కిది హేతువయ్యె
ననుచు నిట్లు భూతాది క్రియాపదాంత
ముల విశేషణ భావి క్రియలను దక్క
మొదలి యంతస్థముల కేత్వములు త్రిలింగ
దేశ భాషను బుట్టవు దితిజభేది!(2-176)

129
ఆదియకారమునకు నుద్యోగపర్వమునందు
గీ.

కొంచెమైనను దగఁ బంచి కుడువ మేలు
పనులయెడ దుఃఖమోర్చి యల్పంబు సుఖము
ననుభవించుట హితము శత్రునకునైన
నిచ్చుటయే లెస్స యడిగినయెడ నృపాల! (2-47)

130
అని వ్రాసినారు.
సూ.

'అద్యః క్రియాసు భూతా
ద్యర్థసముద్యోతితం వినా సర్వః'

అని, 'ఆద్యగం' అను పదములను తీసివేసి, 'సముద్యోతితం' అను
పదమునుంచి దిద్దినారు. మునుపున్న పాఠము అంతటను "అద్యః క్రియాసు