అని అహోబల పండితులవారు వ్రాసినారు. ఈయన తాత్పర్యమున్ను
ళకారమునే కల్పుకొని 50 వర్ణములని స్పష్టముగా నున్నది. ఆయన గ్రంథముల
వలననే కొందఱు క్షకారము గ్రహించినా రనిన్ని, ధాతువు యొక్క షాంత
మధ్యమందు క్షకార ముండుటవలన, క్షకారము ప్రత్యేకవర్ణ మనరా దనిన్ని,
మాహేశ్వరసూత్రములందు లేకపోయినప్పటికీ, కాత్యాయనులవారు వర్ణసమా
మ్నాయమందు చెప్పకపోయినప్పటికిన్ని, ళకారము మాత్రము ప్రత్యేకవర్ణ
మనిన్ని, క్షకారమువలె ళకారమును నెవరికి తప్పించ శక్యముగా దనిన్ని కను
పించుచున్నది. శబ్దశాస్త్రమునందు లేని ళకారము (విషయమున) 'లవయోః'
అని అభేదమున్నంత మాత్రమున నేమి కార్యము : 'లోళః' అని వాల్మీకి
సూత్రము వ్రాసినారు. సంస్కృతమందు ళకారము లేదు గనుకనే, వాల్మీకుల
వారు ప్రాకృతమందు 'కమళం' అని ళకారమే కాని లకారము లేదని చెప్పి
నారు. ఈ సూత్రము వలననే, సంస్కృతమందు ళకారము, ప్రాకృతమందు
లకారము లేవని స్పష్టముగా నున్నది. ఌకారము ద్వైవిధ్యమునకు కొందఱు
దీర్ఘము లేదన్నారు గనుక, ప్లుతముచేత ద్వైవిధ్య మనిన్ని, కొందఱు సాక్షా
ద్దీర్ఘాభావ మైనప్పటికి, ఋకార సవర్ణ మగుటచేత, నా ఋకార దీర్ఘమునుబట్టి
దీనికి దీర్ఘమన్నా రనిన్ని వ్రాసినారు. అయితే, 'రయోస్తు నిత్యం స్యాత్'
(చిం. సం. 22) అన్న సూత్ర వ్యాఖ్య యందు:-
| ‘కశ్చి ద్వదతి సాంగత్యం యతా వేవానయో స్తదా | |
(అను) ఈ కారిక వ్రాసి, యతి కొకడు, ప్రాస కొకడు నంగీకరించుట
వలన నుభయమతము కూడదని కశ్చిచ్ఛబ్ద ప్రయోగముచేత నక్కడ
ఖండించినారు.[1] ఇచ్చట ఏ మాత్ర మా న్యాయము ఎందుకు కలుగదాయెనో
- ↑ "కశ్చిద్వదతి... కశ్చన“ ఇత్యుక్త్వా కయోశ్చిత్త న్మైత్రీ
కల్పకయోర్మత ముభయత్ర కశ్చిచ్ఛబ్ద ప్రయోగేణ అత్యంత పండిత
మ్మన్యతా ధ్వనన ద్వారా పరాకృత్య, ద్వితీయాచార్యేణ- "అనయో
స్సంగతిం యస్తు, కరోతి కవితాకృతౌ. అస్యా అత్యంతదోషత్వాత్,
దుష్కవి స్సహి కథ్యతే" (అధర్వ సం 27 కా) ఇతి స్వమతం ప్రకాశితమ్.
(క. శి. భూ. పు. 195-196)