పుట:Srinadhakavi-Jeevithamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

శ్రీనాథకవి

వినమత్కాకతి సార్వభౌముగవి తావిద్యాధరుంగొల్తు నా [1] యనుగుందాత బ్రాదాత శ్రీకమలనాభామాత్య చూడామణిన్

అను పద్యమునందు తన పితామహుఁడును, కవి తావిద్యా ధురంధరుఁ డును, పద్మపురాణసంగ్రహ కళాకావ్య ప్రబంధాధిపుఁడును నగుకమల నా భామాత్యుఁడు సముద్రతీరము నండని కాల్సట్టణమునకు ప్రభువుగా నుండెనని చెప్పియున్నాడు.

శ్రీ అక్కిరాజు ఉమాకాంతముగారు శ్రీనాథకవిజన్మస్థానము కర్ణాట దేశమనియు, కర్ణాట దేశమున జన్మించినను శైశవమున నే యీతని తల్లిదండ్రులు ద్యోగవశము. సనో మఱి యేకారణముననో కొండవీటి సీమకు వచ్చియుందు రనియు, ఇంటిలోఁ దల్లిదండ్రులలో మిశ్రకర్ణాటము మాట్లాడుచున్నను: బాల్యమునం దెలుగు దేశములో దెలుఁగువారితో గలసిమెలసియున్నందునఁ దెలుఁగువాని వలె'

దోచు చున్నాఁడనియుఁ దెలుపు సపూర్వ సిద్ధాంతము నొక దానెలకొలుప

  1. * ఈపద్య మారీతిని ముద్రిత పత్రియైన భీమేశ్వర పురాణములో నున్నది. విన మత్కాకవిసార్వభౌమ' యను పాఠమునకు బదులుగా నాంధ్ర కవులు చరిత్రము :- “విడుమ ధ్యాంత సార్వభౌము' అనియు, ఇట్లే కవివ జీవితముల యందును, ఉమాకాం. తముగారి పల్నాటి వీర చరిత్ర పీఠిక లోని పద్య మునులందు విన ముజ్జ్యాంత సార్వబౌమ "అని మఱియొక పాఠాంతర భేదమును గన్పట్టుచున్నది. కావున ముద్రిత ప్రతి లోని "విమత్కాకవిసార్వభౌమూ నను పాఠమె సరియైనది కావచ్చును. అట్లయిన యడల శ్రీనాథుని తాత కాకతి సార్వభౌముడగు దండ ప్రతాపరుద్రుని యాస్థానము నలంకరించియుంన్నవాడనుట సమంజసముగా నుండు" నని నా యాంద్రుల చరిత్రములో తెలిపి యున్నారు దీనింజదువుకొని శ్రీ వీరేశ లింగము గారు తామిప్పుడునూతనము బ్రచురించినట్టి యాంద్రక పులచరితములోఁ దమ వెనుకటి పాఠమును విడిచి యాంద్రులను గూర్చి ఏమియుంజప్పకయే వినమత్కవిసార్వభౌమా నను బిరుదమునే క్రమమైన దానిగాగ్రహించి కమలనాభుడు కాకతి సార్వబౌముడైన చండ ప్రతాపరుద్రుని కాలములో నున్న వాడని నేను చిప్పిన సిద్ధాంతము నంగీకరించి యున్నారు.