పుట:Srinadhakavi-Jeevithamu.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్టాధ్యాయము

249


అక్కడి మఠాధీశ్వరులకు బిక్షావృత్తులని పేరు. వారిలో శాంతభిక్షా వృత్తి ప్రఖ్యాతుండైన మహోన్నతుడు నుండెను. శివరాత్రి మహోత్సవ సమయమున శాంతబిక్షావృత్తి యతీశ్వరుఁడు శివక థావినోదంబులం బొద్దుపుచ్చుచుఁ దన ప్రియభృత్యుఁ డగు - శాంతయ్యను శ్రీనాథునిచే గృతికొమ్మని ప్రబోధించినట్లు శివరాత్రి మహాత్మ్యమునఁ జెప్పబడినది. అట్లు శ్రీ నాధుఁడు లక్షాధికారులయి యండిన జంగమగురు పీఠము వారి యనుగ్రహమునకుఁ బాత్రుడై... వారి ప్రార్థనము మీద శివరాతి మహాత్మ్యమును రచించి పువ్వుల ముమ్మిడి దేవయ్య పుత్రుడయిన శాంతయ్యకు సంకితము గావించెను. ఈ కావ్యమునందు కృతిపతి యిట్ల భివర్ణింపబడి యున్నాడు.


పరవాది మత్తేభ వంచాన నాఖ్యుండు
పరహిది మండూక పన్నగుండు
వరనాది నవ మేమ ప మావధీశుండు
పరవాది సాగర బాడబుండు
పరవాడి కుత్కీల భాసురవంధోళి
పరవాదిగే ధన పావకుండు
పరవాది చయతమః: వటలోగ్రభానుండు
పరవాది భోగీ సుపర్ణుఁ డనఁగ

గీ. జటులైన కోలాహల సమర బిరుద
ఘనుఁడు నంగ్రామ పార్థుండు విమత యశుఁడు
శుభుఁడు ముమ్మడి దేవయ్య సంతుఁడనఁగ
వెలసె శాంతయ్య విక్ర మకవీవరుండు.


ఈ గ్రంథమును గూర్చి యీనడును నొక విచిత్ర వివాదము బయలు వెడలినది. ఈ గ్రంథమును శ్రీనాథుడెవరికి నంకిత మొనర్పక ముం దే స్వర్గస్థుఁడై యుండు ననియు, ఈ గ్రంథమునకు భర్తగా గప్పడు నట్టి ముమ్మిడి శాంతయ్య యెట్లో యీకృతిని సంగ్రహించి తన కతి కించుకొని యవతారికాదులను స్వహస్తముసనో,పరహస్తముననో