పుట:Srinadhakavi-Jeevithamu.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సప్తమాధ్యాయము

236

 , వచియింతు వేములవాడ భీమనభంగి
సుద్దండలీల నొక్కొక్క మాటు
భాషింతు నన్నయభట్టు మార్గంబున
సుభయవాక్ప్రౌఢి నొక్కొక్క మాటు
వాక్రుత్తు దిక్కయజ్వ ప్రకారము రసా
భ్యుచిత బంధముగ నొక్కక్కమాటు
పరిఢవింతుప్రభంథ పరమేశ్వరుని దేవ
సూక్తి వైచిత్రి నాక్కొక్కమాటు
నైషధాది మహాప్రభందములు పెక్కు
చెప్పి నాఁడవు మారు నాశ్రితుండవసభు
యిపుడు చెప్పఁబొడంగిన ప్రబంధ
మంకితము సేయు వీర భద్రయ్య పేర '...

శా, ఈక్షోణి న్నిమఁబోలు సత్కవులు లేరీ నేటికాలంబునన్
దాక్షారామ చాళుక్య భీమవర గంధర్వాప్సరో భామినీ
వక్షోజద్వయ గంధసారఘుసృణ ద్వైరాజ్య భారంబున
ధ్యక్షించుం గవిసార్వ భౌమ భవదీయప్రౌఢ సాహిత్యముల్ ..,


అనినపలికి కర్పూరదాంబూల సహితంబుగా జాబూబూనదా బగాభరణంబు లిచ్చినం బరిగ్రహిచనఁట. అల్లాడ వీరభద్రనృపాలుని మూర్తి కొలువున్న సమయమున నెట్లుండునో యాశృంగా రాకృతి నీరీతి నీక్రింది పద్యమున సభివర్ణించెను.


<poem>*సీ మకరకుండలవజ్ర మాణిక్యదీప్తులు
చెక్కుటద్దములపైఁ జిఱువాఱ
గాలిగండ పెండారంబు దోపున
బొమ్మలె వైరిభూ భుజులు వ్రేల
గలయంగ నలదిన కస్తూరి నిత్తావి
యష్టదిక్కులయందు నవఘలింపు
మొగముచూచినమాత్ర మూర్థాభిషిక్తులు
మోడ్పుజేతులు మస్తములఘటింప

గీ..బొఱుగు జబుఁగు దీగెలఁబోలు భామినులు గొలువ .
నిండుకొలువుండెఁ గన్నులపండు వగుచు