పుట:Srinadhakavi-Jeevithamu.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

240

శ్రీనాథకవి

 రాయదేశ్యాభుజంగ వీరప్రతాప
విభవుఁడల్లాడభూపతి వీరవిభుఁడు.,,


ఇట్టి ప్రభువర్యునివలనఁ గర్పూర తాంబూలసహితంబుగా జంబూన దాంబ రాభరణ బులు పరిగ్రహించి తాను గావ్య రచనకు గడంగిన విధము నీకింది పద్యములో ఔలిపి యున్నాడు.

ఆంధ్రక్షమామండలా ఖండలుండైన
వేరు భూపతి కృపా వీక్షణంబు
ఘోడెరాయాంక సద్గురు రాజుభీ మేశ్వ
ర స్వామి పద సమారాధనంబు
కమలాది నిలచు మార్కండేయ శివమౌళి
చంద్రాంశు సవసుధా సారధార
వేదాద్రి నర సింహ విపుల వక్షస్థలి
కల్హారి మాలికాగంధలహరి

గీ. కారణంబు సుక్భోధకములు గాఁగ
సంభవించిన సాహిత్య సౌష్టవమున
వీరభ ధ్రేశ్వరుఁ బ్రబంధవిభునిఁ జేసి
కాశీ ఖండముఁ దెనుంగుగా నొవర్తు. "


ఇతఁ డం దందు నిజ ప్రభావంబుఁ గొంత దెలువు కొన్నను తిక్కనాదులకంటె నెక్కువ ప్రౌఢముగను రసోదంచిత ముగఁ గవవము చెప్పుకు నని కాని డిండిమకవి సార్వభౌముని సుద్భటవివాదమున గెలిచిన వాఁడయ్యును నాడంబరముగా నట్లే ప్రబంధమునను జెప్పు కొనక పైనఁ జెప్పిన విధముగా సాహిత్య సౌష్టవమును బడసి కాశికా ఖండముఁ జెప్పఁ బూనుకొంటినని చెప్పు టెంతయు నౌచితిని దెలుపు : చున్నయది,

ఇతఁడు వేము వీభధ్రనృపతులు చేయు శివార్చనా విధా నము నిట్ల భివర్ణించియున్నాడు,