పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/506

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

468

శ్రీరామాయణము

గనిపింపుఁ డనుచు వై - ఖానస నగముఁ
గని సార్వభౌమ ది - గ్గజము నీక్షించి
కరణీశతంబుతో - గలసి యాకరటి
చరియించుఁ జేరఁగఁ - జనక యాకలన4630
వెదురు గుంపులు నట - వీ ప్రదేశములు
నదులను బసిఁడి కొం - డలు విచారించి
పోయి యుత్తరకురు - భూములయందు
బాయక యిష్టార్థ - ఫలదంబు లగుచుఁ
గలధౌతమయములై - కనుపట్టువృక్ష
ములను నిత్యానంద - ములఁ గూడియున్న
పుణ్యదంపతులనుఁ - బొడగని యత్య
గణ్యమౌ సోమన - గంబు చెంగటను
నావాస మొసరించు - నఖిల దేవతల
సేవించి యుత్తర - సింధువుఁ గాంచి4640
యంతట మఱలిరం - డవలికి నరుగ
నెంతవారికిఁ దీర - దిప్పుడే కదలి
పొండు ముప్పది దినం - బులకును మరలి
రండు రాకున్న నే - రము వచ్చు మీకు
హితము సేయుదు నేను - నీ రాఘపులకు
సతతంబు” నని - శతబలిఁ బనిచి
యందఱిిలోపల - హనుమంతుఁ జూచి
యిందు రమ్మని పిల్చి - యేకాంతమునను
కార్యసాధకుఁడని - కడు నిశ్చయించి
యర్యమ తసయుఁడి - ట్లని పల్కె నపుడు4650