పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/495

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

457

యాయసముఖపురు - షాదకిరాత
కాయాద హేమాంగ - కర్ణ చూలులను
బరికించి పచ్చిచేఁ - పలు దినువారి
నరయుచు జలవాసు - లైన వారలను
ద్వీపవాసులను న - దీప్రాంతభూమి
జూపట్టు పురములు - చూచి శోధించి
సాఁగి యవద్వీప - సౌవర్ణ కుడ్య
భాగముల్ నీహార - పర్వతంబరసి
రత్నవంతము సాగ - రంబు వేలయును
యత్నంబుతోఁ జుట్టి - యచటి ద్వీపములు4370
మరుదేశముల దధి - మత్పర్వతంబు
నరసి యచ్చటనుండి - యతిశోణమైన
శరనిధి దాఁటి య - చ్చట బ్రహ్మ చేత
వరమంది తమచాయ - వచ్చినవారి
యిరుగడ మింటిపై - నేఁగఁగ నీక
తరిమి నీడలు పట్టి - తమరు మ్రింగుచును
ఛాయాపహారిదు - ష్కవులనుఁ బోలు
ఛాయాగ్రహములపైఁ - జనక కేడించి
యావారినిధి దాఁటి - యవలఁ బ్లక్షాఖ్య
చేవెలసిన దీవిఁ - జేరి శోధించి4380
ముందఱనిక్షు స - ముద్రంబుఁ జూచి,
యందులో ద్వీపంబు - లన్నియు వెదకి,
గుల్మలతావృక్ష - కోటి భాసురము
శాల్మలీ ద్వీపంబు - సరణిగా నరసి,
మధురసవార్ధి నే - మఱక శోధించి,