పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/496

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

458

శ్రీరామాయణము

మధువాని యలయక - మాని యచ్చోట
గరిడి మాడ్కిని విశ్వ - కర్మ నిర్మించు
గరుడని యింటి న - ల్గడ విచారించి
యందు భాస్కరునితో - ననిఁ జేసి పొలియు
మందేహులుండు ధా - మము విచారించి, 4390
యవల గుశద్వీప - మారసి, నేతి
రవణంబు గల సము - ద్రంబున వెదకి,
క్రౌంచంబనెడి దీవిఁ - గాంచి శోధించి,
మించి పై దధివార్ధి - మీఱి యాకెలన
మొనయు శాకద్వీప - మున కేఁగి యవలఁ
దనరెడు పాలసం - ద్రము విచారించి,
యానడుమను వృష - భాచలంబరసి,
పైనున్న కాంచన - పద్మసరంబు
తెరవుగాఁ బుష్కర - ద్వీపంబుఁ జేరి
సరణి సుదర్శన - సరసి శోధించి,4400
యందుఁ గ్రీడించు వి - ద్యాధరయక్ష
బృందారకులఁ జూచి - పేర్కొని మ్రొక్కి
యాకడ శుద్ధోద - కాంబుధిఁ జూచి,
వ్యాకీర్ణమైన యౌ - ర్వక్రోధజనిత
బాడబానల శిఖా - పటలంబు నిగుడు
జాడగాఁ జనక యె - చ్చరికతోఁ దొలఁగి
యాతరి వివిధభూ - తారావములకు
భీతినొందక హేమ - పృథివీధరంబు
చేరి యానగముపై - శేషుని ధరణి
భారనిర్వహు నీల - పరిధాను వేయి4410