పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిష్కింధా కాండము

389

పొడవుఁగన్గొని “విరిఁ - బోడి మాసీత
కుంకుమ నలుగిడు - కొనువేళ మిగుల
పొంకమౌ నగుమొగం - బును బోలె" ననుచుఁ
దలచి యంతన పరి - తాపంబు నొంది
కలఁగుచు భ్రమసి కాఁ - క వహించి మిగుల2730
పండువెన్నెలఁ జిక్కి - “బలువిడిఁ గాదె
నెండలు సౌమిత్రి! - యెటకుఁ బోవుదము?
తపియింపఁ జేసి మా - ర్తాండ మండలము
చపలాక్షి యెటువోయె - జానకి యిపుడు"
అనుచు గూర్చుండి - యాయనుజు నూరువులఁ
దనమేను జేర్చి "సీ - తా!" యంచుఁ బలికె
కన్నులు మొగిచినఁ- గాంచి సౌమిత్రి
యన్నతో భయవిన - యముల నిట్లనియె

-: లక్ష్మణుడు శ్రీరామునికి గర్తవ్యముఁ దెలుపుట :-

“దేవ! ధార్మికుఁడ వా - స్తికుఁడవు ధైర్య
భావనుఁడవు కార్య - పరుఁడవా మీఁద2740
నీమేరఁ జింతింతు - రే? దీనులైన
పామరులకు జయ - ప్రతిభలు గలవె?
మానసోత్సాహంబు - మానక వైరి
దానవహరణ య - త్నము సేయు మీవు
నీవు గావలె నన్న - నిమిషమాత్రమున
నీవసుమతితోడ - నెల్ల లోకములు
శరము సంధించి - భస్మము సేయఁగలవు!
వరశౌర్యకేళి రా - వణుఁ ద్రుంచు టెంత?