పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

321

కిష్కింధా కాండము

-: శ్రీరాముఁడు సప్తతాళములఛేదించుట :-

తన సందియముఁదీఱఁ - దలంచి యిట్లనియె,
"ఈతాఁటిమ్రాకులం - దేకవృక్షంబుఁ
జేతులఁ దావంచి - చిదుము పర్ణములు
వాలి యీరఘుకుల - వర్యుఁడం దొక్క
సాల మొక్కనిశాత - శరముచేఁ దునిమి1100
పాదాగ్రనిహతిచేఁ - బలువిడి జిమ్మి
యీ దుందుభికబంధ - మిన్నూఱు విండ్ల
నేల యవ్వలఁ బడ- నేఁడు మీటంగఁ
జాలిన వాలిని - సమయింపఁ జాలు!”
అని పల్కి మఱియు దా - నాత్మఁ జింతించి
యినతనయుఁడు రాము - నీక్షించి పలికె.
"దేవ ! మీశక్తి శో - ధింపఁ దలంచి
యేవ వుట్టంగ నే - నిటు వల్కలేదు.
ఆ వాలిశక్తి యే - నరసినవాఁడ
గావున మీకెఱుఁ - గఁగఁ దెల్పవలసె1110
వెఱపింపలేదు మీ - విక్రమచర్య
లరయ భస్మచ్ఛన్న - మగు నగ్నిరీతిఁ
దెలియకున్నది గాన - దెలుసుకోవలసి
పలికితిఁ దప్పుగాఁ - బాటింపవలదు!
ఆకారమున దోచు - నఖిలంబు మహి వి
వేకుల కట్టి వి - వేక మెక్కడిది
కపులకు? నేనట్ల - గాన మీతోడఁ
జపలబుద్ధిని పరీ - క్షయొసంగు మంటి!"