పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆరణ్యకాండము

221

యేనింద్ర పదమున - కేఁగిన యవుడు
తానందు వచ్చి మా - తండ్రి కోపించి 5260
'పదునాలుగేండ్లు నా - ప్రతినఁ జెల్లించి
తుదిరాక యిటకు వ - త్తురె నట్ట నడుమ
హానిఁ జేసితివి నా - యాజ్ఞకు భ్రష్ట
వై నీవు దబ్బర - లాడిపోయితివి
వ్యర్థజీవనుఁడవై' - యనుగదా! నన్ను
నర్థించి యింద్రాదు - లందఱు వినఁగ
నేల పోవుదు దివి - కేఁ బోక యెచట
నేల నిల్తును సీత - నెడబాసి నపుడె?
హీనమానవు కీర్తి - యెడవాసి నటుల
జానకి ననుడించి - చనియె సౌమిత్రి! 5270
జలకేళి కేఁగెనో? - జానకి పోవఁ
దలఁపదెన్నడు నొంటి - దావెంట బోక.”
అనుచు దిగ్గన లేచి - యదెపర్ణ శాల
వెనక చాయను సీత - విధమునఁ బోయె
సౌమిత్రి! పొమ్మ”న్న - జని యందు వెదకి
యామేర లేదని - యతఁడు వల్కుటయు
విలపించునెడ రఘు - వీరునిఁ జేరి
కలఁగుచు సౌమిత్రి - కన్నీరుఁదుడిచి

—: లక్ష్మణుఁడు రాము నోదార్చుట :—



“స్వామి! యాబలిచేతి - జగతిఁ గైకొనఁడె
తామున్ను శౌరి సీ - తయునట్ల నీకుఁ 5280