పుట:Sri Ramayanamu - Aranya and Kishkindha Kandas.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

148

శ్రీరామాయణము

బ్రేమఁ గొబ్బునఁ జేరఁ - బిలిచిన వారు
వచ్చి యామృగము చె - ల్వమునుఁ జేష్టలునుఁ3490
బచ్చని మెఱుఁగునుఁ - బరికించి చూచి
కన్నుల విందుగాఁ - గని మెచ్చునట్టి
యన్నతోఁ సౌమిత్రి - యపు డిట్టు లనియె.

-:బంగారులేడి మారీచుని మాయ యని శ్రీరామునితో లక్ష్మణుఁడు చెప్పుట:-



"మృగము కాదదియు మా- రీచునిమాయ
యగునని దోచె నా - యంతరంగమున
వేటలాడుచు వచ్చి - వీఁ డాచరించు
బూటకంబులఁ జిక్కి - పొలిసినయట్టి
రాజులు గడు నపా -రము వీని జాడ
లీజటివరు లెల్ల - నెన్నికొనంగ
వినియుందు నిటువంటి - వింతమృగంబుఁ3500
గనినట్టివార - లెక్కడనైనఁ గలరె?
ఇది వాని మాయయౌ - నేల సందేహ
మది యేల మనకు రం - డని” పల్కుటయును
విని యెఱుంగక విధి - విహితమౌ బుద్ధి
తనుఁ జెడ రేఁప సీ - తాకాంత పలికె.

-:బంగారులేడిని పట్టితెమ్మని సీత శ్రీరాముని వేఁడుట:-



"స్వామి! రాఘవ! యిట్టి - చక్కని మృగము
సీమలన్నియునుఁ జూ - చితి మెందులేదు!
ఇది మనోహరరేఖ - నింపు పుట్టించె