పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముడు


నిదర్శనములు చూపవచ్చును. ఇఁక రామాయణ కథానాయ కులం గూర్చి కొంత చర్చింతము.

రాముఁడు

పితృవాక్య పరిపాలకుండనియు, ఒకపత్నీ వ్రతుండనియుఁ బూర్వు లుగడించిరి. రావణుండు లోకకంటకుండనియు, నాతని జంపెఁ గావున నవ తారపురుషుడనియుఁ గొనియాడిరి.

పితృవాక్యపరిపాలకుండేనా ?


కృతజ్ఞ తాపూర్వకంబుగా నిచ్చిన వరద్వయంబున నేకాంగియై రాముఁడు పదునాలు గేండ్లు వనవాసంబుఁ జేయుట, భరతుండు పట్టాభిషి కుండగుట యభిలషించి కైక దశరథుని యర్థించెను. దశరధుండుమును. పిడుగడచినట్లై యగును, గాదని చెప్పకుండఁ జింతావేగమున నొడలు తెలి యక నోటికొలంది కైకను దిట్టి, తిట్టి విసంజ్ఞుడైపడిపో యెను. రాముఁడు చనుదెంచి సర్వంబును గై కేయి ముఖం బున నేతంగి వనవాసంబునకుఁ బయసమయ్యెను, అనుయాయి యయిన లక్ష్మణుండు రాకమాననని చెప్ప, అర్ధాంగియయిన సీత తన్నుఁ గొనిపోవఁగంటి నీటితో బతిమాల, శ్రీరాముండు వెంట నే యిరువురితోడను బయనించెను. దశరథుండు శ్రీరా మునకు నేమియుం జెప్పలేదు. కైక యొక్కనినే యడవికిఁ బొమ్మనియె. ఇరువురితోఁ గలసి శ్రీరాముఁ. డడవికి

23