పుట:Sinhagiri-Vachanamulu.pdf/67

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

“ఆధునిక వచన పజ్యా"లమాతృక

అంత్యప్రాస ఘటితాలై న ఆధునిక వచన గేయాలకు మాతృకా ప్రాయమైన యీ వచనం అవలోకించండి.——

అంకిలియనియెడి తెవులింటికి దిప్పు
అసత్య కృతమే ముప్పు
తగవు ధర్మము నడిపినదె యొప్పు
అనాధపతీ నరహరీ మిమ్ముదలపనిదే తప్పు"

ఇంతటి మహత్త్వ బృహత్త్వాలు గల కృష్ణమాచార్యులవార్ని గురించి సింహగిరి వచనాలను గురించీ చెయ్యవలసిండి, చెప్పవలసిందీ ఎంతేనా ఉంది.

రెండేళ్ళ కిందట కృష్ణమాచార్య సంకీర్తన జయంతి ఉత్సవానికి సింహాచలం వచ్చిన మాన్యమిత్రులు శ్రీమాన్ కులశేఖర రావు గారు సింహాచల దేవస్థానంవారు సింహగిరి వచనాలను ముద్రించవలసిన అవసరం ఎంతో ఉందని చెప్పిన మీదట అప్పుడున్న కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ ఎస్.చిట్టిబాబు గారు నా పీఠికతో నేను సేకరించిన మరికొన్ని వచనాలతో గ్రంధాన్ని ముద్రింపచేయటానికి సిద్ధపడి పూర్వరంగం ఏర్పరిచినారు.

తరువాత వారి స్థానంలో వచ్చిన మాన్యమిత్రులు శ్రీమాన్ జి. వి. నరసింహమూర్తి గారు ఈ కార్యభారాన్ని స్వీకరించి నేటికి కృతకృత్యులయినారు,

ప్రకృత ముద్రణంలో శ్రీమాన్ కులశేఖరరావుగారు ముద్రించిన వచనాలను వాల్తేరు లిఖితప్రతి సాయంతో సంప్రదాయాన్ని అనుశీలిస్తూ అవసరమయినచోట్ల పరిష్కరణం చేసేను. ఇంకా చేయవలసినవే ఎన్నో ఉన్నాయి.

తిరుపతిలోని ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారంనుంచి నేను సేకరించిన వానిలో కొన్ని వచనాలను ఇందులో మొదటి అనుబంధంగా చేర్చేను. తిరుపతి ప్రతులు (1) R, 206 (2) R 1034 మద్రాసు ప్రాచ్య లిఖిత పుస్తక భాండాగారం వ్రాత ప్రతులనుంచి వరుసగా 1914-15, 1933-34 సంవత్స