పుట:Shriiranga-mahattvamu.pdf/410

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

255


బోవ నడిచి చెప్పం బయి
పై విశ్రుతికెక్కు నమ్మహాతీర్థమునన్.

240


క.

అతఁ డెఱిఁగించెడి నఖిల
శ్రుతితతియు మదీయశక్తిచోదితుఁడై నీ
కతిముదమున నని లక్ష్మీ
సతీయుతుఁడు నరిగె నంత సంచితలీలన్.

241


వ.

పరమపవిత్రుం డగు సునేత్రుకడకుం జని కుంజరవరదు వరప్రకారంబుఁ
జెప్పి యప్పతత్రివరు ననుమతంబున సమంత్రకంబుగాఁ దత్తీర్థస్నానంబుఁ
జేసి చరితార్థం బొంది గురుభజనానురూపంబుగాఁ దానును విహగ
రూపంబుఁ బూనిన నాసమ్మదంబున బతత్రివరుండు తద్విప్రముఖ్యునకు
నఖిలవేదంబు లుపన్యసించె. నతండును బుండరీకాక్ష ప్రసాదసాధిత ప్రభా
వంబున సకృదుచ్చారణమాత్రంబున సకలనిగమపారగుండై యచ్చట
జిరకాలంబు వసించి విష్ణుపదప్రాప్తుం డయ్యె. సునేత్రుండు నిరర్గ
ళంబగు నపవర్గంబు నొందె. నాప్రభాకరమునీంద్రునకు శిష్యులు
నలువురు గలిగి రందు సుదర్శనాఖ్యుండ నగునేనును సువర్ణబిందుండు
సుతామ్రచూడుండును బృహన్మయుండును గ్రమంబున ఋగ్యజుస్సామా
ధర్వణంబులు తత్తచ్ఛాఖాసమేతంబుగా ఖగాకారధరులమై యభ్యసించితిమి.
నీడోద్భవంబులు నాతోడం జదువు మునికుమారు లనిచెప్పి జయధరునకు
నయ్యండజశ్రేష్ఠుండు వెండియు నిట్లనియె.

242


క.

పరమంబగు తప మనినం,
బరమపదం బనిన దానిఁ బరికించుచు నీ
పరదేశము నాదేశము
మఱి యితరము లెఱుఁగ నేను మనుజాధీశా.

243


క.

ఈతరువులు నీలతలును
నీతృణగుల్మాదివనమహిస్థలి పుణ్యో
పేతాత్ము లగుమహర్షి
వ్రాతముగా నెఱుఁగు మాత్మ వసుధాధీశా.

244