పుట:Shriiranga-mahattvamu.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

254

పంచమాశ్వాసము


నిలువఁ దీర్చిన ఫాలపలకంబు తిలకంబు
చిఱునవ్వు వెన్నెల చిలుకుతళుకు
కల్పమంజరులచేఁ గడునొప్పు నునుగొప్పు
సొంపారు నురముపై కెంపుసొంపు


తే.

బాలమార్తాండబింబంబు ప్రభలడంబు
నంబరంబున నెఱపుచక్రంబు నొఱపు
గలిగి జగదేకకల్యాణలలితమూర్తి
వెలయ నమ్మునియెదుట నావిర్భవించె.

235


చ.

అతఁడు నభూతపూర్వమగు సప్పరమేశుని దివ్యవిగ్రహం
బతులితభక్తిఁ జూచి వినయంబును హర్షము సంభ్రమంబు న
ద్భుతమును నంతరంగమునఁ దొట్రుకొనన్ మహిఁ జాగి మ్రొక్కి, యూ
ర్జితబహువేదసూక్తములచే వినుతించె ననేకభంగులన్.

236


క.

అప్పుడు మదిఁ గృప చిప్పిల
నప్పరమేశ్వరుఁడు ప్రీతుఁడై భవదిష్టం
బిప్పుడు ఫలింపఁ జేసెద
చెప్పుము నీవనిన నతఁడు చిత్రం బలరన్.

236


తే.

కదియ మోడ్చిన చేతులు నుదుటఁ జేర్చి
పంకజోదర! నావిన్నపంబు వినుచు
యెల్లవేదంబులను బార మెల్లఁ జదువ
నోపు విజ్ఞానశక్తి నా కొసఁగవలయు.

237


చ.

అనుటయు నవ్వరం బొసఁగి యాతని కిట్లను బుండరీకలో
చనుఁడు గణింప నెవ్వరికి శక్యముగాని శ్రుతుల్ పఠింప నే
యనువున దీరుఁ గొంచెమగు నాయువునుం గలయట్టిదేహకిన్
విను మటుగాక పాపములు వీడినగాని ఫలింప వేమియున్.

238


క.

కావున బహుజన్మార్జిత
మై వెనుకం దగులు దారుణాఘప్రతతిం