పుట:Shriiranga-mahattvamu.pdf/411

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

256

పంచమాశ్వాసము


మ.

ధరణీనాయక నీకులం బతిపవిత్రంబయ్యె, నీ విమ్ములం
బరిపాలించు మహీతలంబు నతిధన్యంబయ్యె, నీపుత్రులుం
బరలోకోన్నతసౌఖ్య మొందిరి, దిశాపాలిన్ భవత్కీర్తులం
జరగెం బుష్కరిణీనిమజ్జనము నిష్ఠ న్నీవు గావించుటన్.

245


ఉ.

నావుఁడు సంతసించి జననాథుఁడు తన్నుఁ గృతార్థుఁగా మదిం
భావన సేయుచున్ విహగనాథునకున్ ధరఁ జాగి మ్రొక్కి సం
భావన జేసి యాతఁ డనుపన్ బహుమంగళతూర్యమంజులా
రావము లుల్లసిల్లఁగఁ బురంబున కేఁగెఁ జమూసమేతుఁడై.

246


క.

అతనికిఁ గలిగిరి నూర్వురు
సుతు లందఱు రూపవిభవసుస్వరమతు ల
చ్యుతసువ్రతనిష్టాపర
రతులును నగువారు సుజనరంజితచరితుల్.

247


క.

వారు తనపంపు సేయఁగ
నారాజవరుం డొనర్చె నమితాధ్వరముల్
నేరుపున సుజను లౌనన
వారక దక్షిణలతోడ వైభవ మెసఁగన్.

248


క.

ఈలీల నతఁడు ధరణీ
పాలన మొనరించి రాజ్యపదముకుఁ దనయుం
జాలించి యితరసుఖములఁ
దేలియుఁ దపమాచరించి త్రిదివము కేఁగెన్.

249


వ.

అని చెప్పి మార్కండేయుం డన్నరేంద్రున కిట్లనియె.

250


చ.

జనవర! నీవు సోమకులసంజనితుం డనివార్యధైర్యస
ద్వినయవివేకబాహుబలవిక్రమశాలివి, భూప్రజానురం
జనచతురుండ వట్లగుటఁ జాల గృతార్ధుఁడ వయ్యు భక్తి నె
క్కొనఁ జని చంద్రపుష్కరిణిఁ గ్రుంకిడి యచ్చటి విప్రకోటికిన్.

251