పుట:Shriiranga-mahattvamu.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

పంచమాశ్వాసము


స్థానమున కరిగి రత్తఱి
నానరపతి సతులు దాను నడలుచు నుండన్.

84


శా.

అంతం బుష్కరిణీతటంబున హరిధ్యానామృతానందిత
స్వాంతుండై వసియించియున్న గురునిన్ వాల్మీక దర్శింప న
త్యంతప్రీతి దలిర్ప నేఁగుచు భరద్వాజుండు తన్మేదినీ
కాంతుం డున్నపురంబుపై నరుగ మార్గం బౌట నచ్చోటికిన్.

85


ఆ.

వచ్చి తనకు శిష్యవరుఁ డగుతత్పురో
హితునివలన నమ్మహీశ్వరునకుఁ
దొడరినట్టి కష్టదుర్దశ లన్నియు
విని మనంబులోనఁ గనికరించి.

86


క.

తా నటఁ జని, నిజగురునకు
నానృపువర్తనముఁ జెప్పె ననుకంప మదిం
బూని, ముని వాని రాష్ట్రము
లో నుండక చనిన విప్రలోకమునెల్లన్.

87


చ.

పిలువఁగఁ బంపి వారలకుఁ బ్రీతి దలిర్పఁగ నిట్లనున్ సము
జ్వలమతులార! మీ రలిగి వచ్చినయంతటనుండి పైపయిం
దలకొనినట్టి యాపదల దందడిఁ గుందిరి భూప్రజల్ మహీ
తలపతియున్ దురంతపరితాపనిపీడితుఁ డయ్యె నెంతయున్.

88


క.

నాలుగు పురుషార్థములకు,
నాలుగు వర్ణములవారి నడవడికిని, భూ
పాలకుఁడు కారణము త
న్మూలంబున నెపుడు సర్వముం దలపోయున్.

89


చ.

అలుకలు దక్కి నాపలుకు లాదటఁ గైకొని సత్కృపాగుణం
బలపడ ముద్ధరింపుఁడు మహామహులార! నితాంతశోకవి
హ్పులుఁ డగు మేదినీశుని దురంతములైన యుపద్రపంబులన్
బెలుకుఱి నెమ్మనంబు దలపించుచునున్న మహీప్రజాలికిన్.

90