పుట:Shriiranga-mahattvamu.pdf/382

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

227


వ.

అని చెప్పిన నతనివాక్యప్రబోధితులై క్రోధంబు లుడిగి ప్రసన్నచిత్తులైన
భూసురోత్రముల పశ్చాత్తాపమానసుం డగుమానవేంద్రునిం గలసి వారలఁ
దోడ్కొనుచు నత్తపోధనసత్తముండు నఖిలకామితార్థంబగు బిల్వతీర్థంబున
కరిగె నప్పు డయ్యెడ నున్న మహామునిగణం బితనిరాక గని రాకాసుధాక
రోదయంబున నున్నిద్రంబగు సముద్రంబునుంబోలె నిబ్బరంబుగా నుబ్బి
సముచితసత్కారంబు లాచరించి సమంచితాన్యోఽన్యప్రియభాషణంబులఁ
బరితుష్టులై యున్న సమయంబున.

91


చ.

అనుపమదివ్యసౌరభసమంచితకోమలగంధవాహముల్
మునుకొని వీచె, బిల్వతరుమూలమునన్ వరపుష్పవృష్టి భో
రన గురిసెన్, బదంపడి తిరంబున మ్రోసె నశేషవాద్యని
స్వనము లనంతరంబు వినవచ్చె మనోహరనవ్యగానముల్.

92


క.

ఈరీతి నుభయసంధ్యల
నారూఢములైన మంగళాచారము లే
వారఁ గని పుట్టఁజూలియు
భూరమణుం డద్భుతమ్ము బొందుచునుండెన్.

93


ఉ.

అక్కడి కేగుదెంచి సముదంచిత దివ్యతనుప్రభాతతుల్
దిక్కులఁ బిక్కటిల్ల నతితీవ్రతపోనియమప్రసిద్ధిఁ బెం
పెక్కిన శిష్యకోటి తను నెంతయుభక్తి భజింప లోకముల్
మ్రొక్కు సనత్కుమారమునిముఖ్యుఁడు తీర్థనిషేవణార్థియై.

94


క.

అప్పుడు వల్మీకభవుం
డప్పద్మజసుతుఁడు దాను నాత్మల ముదముం
జిప్పిల నాలింగనములు
చొప్పడ గావించి యుచితసత్పీఠమునన్.

95


వ.

సుఖాసీనులై యున్న యవసరమున నవగతమనోగతవికారుం డగు
సనత్కుమారు నుపలక్షించి యక్షయజ్ఞానకురారదారితసంసారభూజుం
డగు భరద్వాజుం డిట్లనియె.

96