పుట:Shriiranga-mahattvamu.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

225


తీర్థంబున బ్రహ్మవర్ఛసోదారుండగు వర్చసుండను బ్రాహ్మణుండు బ్రహ్మ
జ్ఞాననిరతుండై సంసారవిరక్తిం బొంది నిత్యానందంబు నొందె, భార్గవ
కులవిస్తారుండైన తారకుం డను తాపసాగ్రణి కేసరతీర్థంబునఁ దపంబు సేసి
భవపాశంబులం బాసె, జితారివర్గుండై వర్గగోత్రజాతుండైన రుక్మదృష్టి
భజదభీష్టఫలకదంబం బగు కదంబంబు నుపాసించి బ్రహ్మపదప్రాప్తు డయ్యె,
నఖిలలోకోపాస్యుడగు కాశ్యపమునీశ్వరుండు విధూతపావధూమ్రం బగు
సౌమ్రంబు నాశ్రయించి యమృతత్వంబు నొందె. మఱి యనేకు లీతీర్థంబుల
నిజమనోరథంబు లవితధంబులుగాఁ బడసి రని చెప్పి యామృకండనంద
నుండు వెండియు నిట్లనియె.

81


క.

శ్రుతిపర్వమై, మహాఘ
ప్రతతిం బాపుచు నభీష్టఫలదం బగునీ
యితిహాస మొకటి చెప్పెద,
క్షితినాయకతిలక చిత్తగింపుము ప్రీతిన్.

82


సీ.

జయధరుఁడను నొక్క జననాయకుఁడు సుధా
కరవంశ్యుఁడు ధరిత్రిఁ గలఁ డతండు
క్రూరుఁడై భూసురకోటికి నెగ్గులు
గావించువారు, తద్గావలోప
పావకజ్వాలలఁ బరితప్తహృదయులై
విసివి యారాజ్యంబు విడిచి చనిన,
శూద్రభూయిష్టమై శ్రుతిఘోషరహితమై
భయరోగదుర్భిక్షబహుల మగుచు,


తే.

నాడు నాటికి రాష్ట్రంబు నాశమొంది,
కరితురంగమరథభటకాంచనాది
సంపదల సొంపు సకలంబు ముంపు దప్పి,
దీనదశ నొందె నజ్జగతీవిభుండు.

83


క.

వాని సుతశతము నొక్కట
నానామయపీడఁ జాల నవసి కృతాంత