పుట:Shriiranga-mahattvamu.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

చతుర్థాశ్వాసము


గావించి, మఱి సర్వకార్యమ్ములందుఁ ద
ద్భావస్థుఁడై, వానిఁ బ్రత్యహంబు
చేష్టింపఁజేయు నశేషశభాచర
ణంబులకును దాన సాక్షి యగుచుఁ,
గర్మానురూపముల్ గా సుఖదుఃఖముల్
పరువడి ననుభవింపంగఁ బంపు


తే.

నట్టి సర్వేశ్వరుని యాజ్ఞ నఖిలభూత
తతుల శాసింపఁ బ్రభుఁడైన దండధరుని
శాసనంబున, లోకసంచయమునందుఁ
దిరుగుచుందుము నేము తత్కింకరులము.

38


క.

పలుమఱు నిది యొనరింపని
కలుషంబులు లేవు, పాపకరులకు బైఁబైఁ
దలమగు బాధలు పుణ్యా
త్ముల కతిసౌఖ్యము నొనర్పుదుము మే మెపుడున్.

39


వ.

అని శమనదూతలు చెప్పిన నప్పుణ్యవతి వారల కిట్లనియె.

40


ఉ.

తప్పదు మీరు పల్కిన విధం బఖిలంబును భూతకోటి, కి
చ్చొప్పు సనాతనంబు, విధిచోదితమై క్రియ యెట్టివారికిం
ద్రిప్ప వశంబె, యైనను మదీయసమీపముఁ జేరెఁగాన నే
నిప్పుడు దీనికైన నెగు లేగతినైనను మాన్పఁగాఁ దగున్.

41


క.

కావున నీసతి సుగతికి
నేవిధమునఁ బోవు నెట్టి యే నొనరింతున్,
నావుడు మితభాషిణియగు
నావిమలచరిత్రతోడ నని రాదూతల్.

42


ఆ.

సకలకర్తయయిన శార్ఙ్గిశాసన మెవ్వఁ
డతకరింపఁ జూచునట్టి జడుఁడు