పుట:Shriiranga-mahattvamu.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

127


క.

నావుఁడు నా యుడుపతి కను
నావిభుఁ డిది పొసఁగు నిచటి యనఘులుఁ గానం
గా వలతురు నను నితరప
దావాసుల కలవిగా దుదారుల కైనన్.

160


వ.

ఇటమీఁద లంకాధిపతి యగు విభీషణుకతంబున నీసరిత్తీరంబున నెల్లవారికిఁ
బ్రత్యక్షంబై యుండెద నది కారణంబుగా ధారుణీవలయంబు నిరుపద్రవంబై
మెఱయు, నపుడెపు డిప్పరిసరంబున మదీయదివ్యధామంబు నిలిపి నిజపురం
బున కరుగునది-కారణంబుగా ధారుణివలయంబు రంగమందిరం బైనభుజంగ
భోగతల్పంబున ననల్పభోగంబునఁ గల్పాంతపర్యంతంబు లోకాను
గ్రహార్థంబుగా వసియించెద-నా వేళన నీవు నన్ను దర్శించెద వింకఁ బ్రతి
పర్వంబును బుష్కరిణీతీర్థసేవార్థం బిచటి కేతెమ్ము-పొమ్ము-నీ నిండు
వెన్నెల యఖిలజగత్పావనం బయ్యెడుమని యాదేవదేవుం డంతర్ధానంబు
నొందెఁ జంద్రుండును దద్వచఃప్రకారం బాసరోవరభజనాపరాయణుండై
యున్నవాఁ డని చెప్పి యప్పారాశర్యుండు మఱియు నాగదంతున
కిట్లనియె.

161


క.

పదియోజనములు నైదుం
దదర్ధమును నందు సగము తగు పఱపై-యిం
పొదవుఁ గృతాదియుగమ్మున
సదమల సలిలములఁ జంద్రసరసియు బెడఁగై.

162


క.

అంతట కలియుగమున నం
తంతకుఁ బ్రతిదినము నల్పమగు సస్తనగ
ప్రాంతముఁ జేర్చిన యర్చి
ష్మంతుని కిరణోత్కరప్రసారముకరణిన్.

163


ఆ.వె.

కలఁక యింత లేక కడుచల్లనై నల్పు
లొలయు చంద్రసరసి సలిలపూర
మనఘ! కలియుగాంత మగువేళ దుర్గంధ
యుక్తమై కలంగి యుండు నపుడు.

164