పుట:Shriiranga-mahattvamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

తృతీయాశ్వాసము


సీ.

మండలాధిపులకు మరణ మెప్పుడు గల్గు
నపుడు రక్తచ్ఛాయ నగలించు
మాన కెన్నఁడు రాజ్యహాని పాటిలునాఁడు
నెఱయంగఁ బసరువన్నియ వహించు
నఖిల ప్రజాసంక్షయం బగు నేవేళ
నాతఱి క్రిమిమయం బగుచునుండుఁ
జొప్పెడు వేళ విక్షోభ మేసమయమం
దయ్యెడ ఫేనంబులై కలంగుఁ


తే.

బేర్చు నాకాలమున ననావృష్టిదోష
మట్టి పట్టునఁ జువ్వన వట్టిపోవు
నింకఁ బెక్కెన్న నేల యీ యిందుసరసి
దోచు విపరీతములు-విపత్సూచకములు.

165


మ.

నృపులుం బోరక భావికాలమున శాంతిం జెందుచో- దుగ్ధస
చ్ఛవియున్ విప్రులు సౌఖ్యమందునెడలం జంద్రోపలచ్ఛాయయుం
భువి నెందుం ఘనవృష్టి గల్గుతఱి నుద్భూతోర్మిజాలంబునై
సువిశేషస్థితిఁ దత్సరోవరము పొల్చున్ మంగళావాసియై.

166


తే.

ఎన్న ముప్పదిరెండు యోజనము లంత
మేరయై యొప్పు దేశవిస్తారమెల్లఁ
గాలవశమునఁ బొడవఱి కలియుగాంత
వేళ నత్యల్ప మయ్యెడి విప్రవర్య!

167


వ.

సకల భూతక్షయకరంబుగా నాయుగంబున నఖిల వర్ణంబులకు నుపప్లవం
బగ్గలం బయ్యెడు- నప్పు డాప్రదేశంబు నిర్మనుష్యం బగుట దేవతాసంచా
రంబ కాని యొండు లేకుండుట -ననాచారులు నన్యాయకారులు-నామ్నాయ
దూషకులు- నార్యజన భయంకరులు-నల్పాయువులునై యెల్లవారును బరమ
కల్యాణకారకు లగువారినామోచ్చారణంబు విన్నంతన విద్వేషించుచుఁ దమః
ప్రవర్తకుం డగురుద్రుండు తమకు దైవంబుగా నుపాసించెద-రమ్మహా
దేవుండు జగద్విమోహార్థంబుగాఁ దాను దైవం బని కల్పించిన తామస