పుట:Shriiranga-mahattvamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరంగమహత్త్వము

123


మ్మనమున వారి నందఱ సమంబుగఁ జూడక రోహిణీసతిం
ఘనబహుమానపూర్వకముగాఁ బనిసేయుచు నుండు నెప్పుడున్.

135


క.

దానికి నశ్విన్యాదు ల
నూనవ్యధఁ జెంది తండ్రియొద్దకుఁ జని దీ
నాననలై పతిచేఁ దమ
కైన పరాభవముఁ జెప్ప నాతఁడు గినుకన్.

136


శా.

ఆరాజుం బిలిపించి యిట్లనియె-నీ వన్యాయసంచారివై
తారానీకము లెల్ల నీవలని నాథప్రాప్తి తుల్యంబుగాఁ
బ్రారంభింపక దుర్వివేకసరణిన్ బాటింపుచున్నాఁడ వీ
దౌరాత్మ్యంబుఁ దలంప మేలగునె చంద్రా! రోహిణీవల్లభా!

137


క.

ఇది మొద లందఱకునుఁ బ్రియ
మొదవఁగ సమభావవృత్తి నుండుట గడుమే
లది గాక తప్పి తిరిగినఁ
దుదిఁ గనియెదుగాక పొమ్ము దురితఫలంబున్.

138


క.

అని దక్షుఁడు తన తనయల
ననునయములఁ దనిపి, కినుక ననుప సుధాంశుం
డును జని ముందటి తెఱఁగున
దనప్రియయును దాను సమ్మదంబున నుండెన్.

139


మత్తకోకిల.

ఆతెఱంగున కాత్మలన్ పగ పగ్గలింపఁగ వెండియున్
తాత పాలికి నేఁగి వారలు తద్విధం బెఱిఁగింప న
బ్జాతసంభవపుత్రుఁ డప్పుడు చంద్రునిం బిలిపించి, ధ
ర్మేతరంబు భవచ్చరిత్ర మిదేల మానవు బేలవై.

140


వ.

ఇంక నిటమీఁద నీవర్తమానం బిట్టి దయ్యెనేనియు గొఱఁగాదు తప్ప దేఁ
జాఁటిచెప్పితి, నెప్పగిది నైనను బుద్ధిమంతుండవై యుండు పొమ్మని యుల్ల
సంబు లాడి వీడ్కొలిపిన గ్రమ్మఱ వచ్చి మామ మాటలు గీటులఁ బుచ్చి
యచ్చంద్రుండు సాంద్రానురాగంబున రోహిణీసంభోగలంపటుండై యుండె