పుట:Shriiranga-mahattvamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

41

శ్రీరంగమహత్త్వము


సీ.

భరియించెఁ దద్దివ్యభవనంబు ఖగరాజు
కఠిన బంధురతర స్కంధపీఠిఁ
బట్టె దర్వీకర ప్రభుఁడు శ్వేతచ్ఛత్ర
మురుఫణామండల స్ఫురణ మెఱయ,
నిడిరి వింజామర లిరుగెలంకుల జోక
యై సుధాకరుఁడు సహస్రకరుఁడు,
బకలంబు సేసె హాటక వేత్రపాణియై
తఱమి విష్వక్సేన దండనాథుఁ


తే.

డలిక ఘటితహస్తాబ్జులై యంతనంత
బలసి కొలిచిరి సకలదిక్పాలవరులు
వచ్చె శ్రీరంగధామంబు వచ్చెననుచుఁ
జదలఁ గొదలేక కాహళస్వనము లెసఁగె.

191


వ.

ఇవ్విధంబున స్వయంవ్యక్తంబును దేజోమయంబును, బ్రణవస్వరూపంబును,
బ్రభూతవైభవాభిరామంబును, నగు శ్రీరంగధామంబు దృగ్గోచరం బగు
టయు దిగ్గున గ్రమ్ము సమ్మదామృతరసంబునఁ బులకాంకురంబులు దలఁ
కొనఁ గనకనికషసుషమావిశేషంబున కుపమేయం బగుఛాయం బొలుచు
కాయంబు భూభాగంబునఁ జాగిల్లఁ బ్రణమిల్లి శారదావల్లభుండు యుగప
దుల్లసితచతుశ్శ్రుతిప్రయుక్తంబులగు సూక్తంబుల నభినుతించె, నంత
నఖిలగుణగణప్రశస్తుండును వేత్రహస్తుండును నగుచు నందుం డాశతా
నందునకు నమ్మహనీయమందిరంబుఁ జూపి యిట్లనియె.

192


మ.

అరవిందాసన నీతపంబు ఫలితంబై తోఁచె, లక్ష్మీమనో
హరు గేహం బిదె చూడు, లోచనము లింపారంగ నీరంగమం
దిర మయ్యిందిరతోడఁ గూడి యనురక్తిన్ యోగనిద్రాళుఁడై
హరి యున్నాడు జగత్కుటుంబ పరిరక్షాయత్త చిత్తంబునన్.

193


వ.

అని నిర్దేశించినఁ గనకగర్భుండు నిర్భరానందంబునఁ దత్ప్రదేశంబు డాయం
జనునప్పు డూర్ధ్వాధస్స్థలంబులఁ గనకమహిమండలంబులును, మధ్యభాగం
బున శ్రీదేవియు, నభ్యంతరంబున ననంతభోగియుఁ, బ్రతిహారాంతికంబున