పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

155

స్త్రీలు శ్రీరాముల వారిచేఁ జెప్పఁబడిన సమయములయం దితరులకు గనఁబడుట యాచారమై యుండెను.

ఆపిదప నాదేవి శ్రీస్వామివారిసన్నిధికి వచ్చి నిలుచుకొని కొంతవరకు దుఃఖించి యుపశమించిన పిదప శ్రీస్వామివారు:--

చ. "సరసిజనేత్రి ? యాలమున శాత్రవునిం బరిమార్చి నిన్ను వే
     జెఱవిడిపించి పౌరుషముఁ జెల్లఁగఁజేసి యమర్ష లాభమున్
     బరువడిఁగాంచి చిత్తమున నాటినవైరి కృతానమానమున్
     వరుసవిషాదముం బెఱికివైచి కృతార్థుఁడ నైతి నెంతయున్ .

క. పౌరుషము దృష్టమయ్యెను
    జారుముఖీ శ్రమము నేడునఫలం బయ్యెన్
    వారక ప్రతిజ్ఞ దీరెను
    ధారుణిలో నేను జాల ధన్యుఁడ నైతిన్.

ఉ. ఏ నెడఁబాసియున్న యెడ నీచలచిత్తుఁడు రావణుఁడు నిన్
     గాననసీమనుండి చులుకన్ వెసముచ్చిలితెచ్చే నింతయున్
     మానిని దైవకృత్యమిది మామక పౌరుషశక్తిచే రహిన్
     వానివధించితిన్ ద్రిభువనంబుల భూరియశంబుఁ గాంచితిన్.

క. తనకొదవిన యవమానము
   ననుపమ తేజమున నవలనటుద్రోయఁగఁ జా
   లని యల్పతేజుఁ డగుపురు
   షునకుం బురుషార్థ మరసిచూచినఁ గలదే."