పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

51

5వ అధ్యాయము.

యున్నను అనుకూలావకాశములు పొసగినప్పుడెల్ల కలియుచుండును.

163. ఒకటికి సున్నలుచేర్చుచుపోగా, దానివిలువ నెంతగానైనను పెంచవచ్చును. ఆఒకటితొలగెనా, ఎన్నిసున్నలున్నను విలువయుండదు. అదేవిధమున అద్వితీయుడైపఱగు బ్రహ్మము నంటియుండనంతవఱకును జీవునకు విలువయుండదు. సమస్తమునకును బ్రహ్మముతోడి సంబంధముచేతనే విలువ ఘటిల్లుచున్నది.

164. అట్లే ఒకటినిబోలుబ్రహ్మమును అంటియుండి తన కర్మలన్నింటిని బ్రహ్మముకొఱకుగానె నిర్వహించుచుండునంతవఱకును జీవుడు క్రమాభివృద్ధి గాంచుచుండును. అందుకు మారుగా యతడు బ్రహ్మమును నిర్లక్ష్యభావముతోజూచి, తానుగావించు కృత్యములనేకమును ఘనకార్యములుగ గణనచేయుచు, సర్వమును తనగణ్యతకొఱకే పఱగునట్లెంచుకొనెనా, అందువలన అతనికి ప్రయోజనముండజాలదు.

165. నారాయణుడే నరరూపమున లీలలుసలుపుచుండును. అతడు యింద్రజాలికుడు; జీవజగత్తులనెడు ఈవిచిత్రజాలమెల్ల వానిఇంద్రజాలమే. జాలకుడొక్కడే సత్యము. జాలము మిధ్య అగు గదా!


____________