Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

19.

శాసనపద్యమంజరి.

23

శ. స. 1114

ఇది పశ్చిమగోదావరీమండలమందు పాలకొల్లుగ్రామములో శ్రీరామేశ్వరస్వామియాలయములో నొకరాతిస్తంభముమీఁద చెక్కఁబడినది. (South Indian Inscriptions Vol. V. No. 173)

క.

మనుశివ(వత్సర)సంఖ్యం బయో[1]
జిని శ్రీసోమేశ్వరునకు శ్రీదుర్గ్గికిం చే
కొని రెణ్డుసంధ్యదీపము
లొనరంగ భణ్డరువుకొమరం డొగిం బెట్టె దగను.

—————

24

శ. స. 1123

ఇది పశ్చిమగోదావరీమండలములో ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కబడి యున్నది. (South Indian Inscriptions Vol. V. No. 185)

చ.

పురకరకైరవాప్తశశిభూరిశకాబ్దము లొప్ప శాంర్జ్ఞికిని
సరసిపురంబులో నిలిపె సంద్ధియ[2]దీపము వెన్నిసెట్టికిం
దారుణియ ఘంట్టసాలపురి దారమకును[3] ఫల మొంద్ద వీరికిని
వరసుత యైనవాసమ ద్రువంబుగ నాశశితారకంబుగాను.


ఈసంద్యదీపము సేకొని కన్నమపణ్డితులు నామనయు రెణ్డు
సంధ్యల నడపంగ్గలవారు.

—————

  1. గణము తప్పినది. "వత్సర" శబ్దమునకు బదులుగా "మిత" యని యుండిన సరిపోవును.
  2. "సంద్దియ" అని యుండవలెను.
  3. దారమకున్