Jump to content

పుట:Shaasana padya manjari (1937).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

18

శాసన పద్యమంజరీ.

22

శ. స. 1114(?)

ఇది పశ్చిమగోదావరీమండలములోని ఏలూరుమసీదులో నొకస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (South Indian Inscriptions Vol. V. No. 186.)

సీ.

శ్రీశుభశకదరదిశవస్సరములు [1]
            వేదత్రి(లో)చనరుంద్ర[2]సక్య[3]
వెలయంగ వైశఖ విమలసప్తమియును
            సోమవాసరమున సుస్తిరముంగ
కొలని కేశవదే(వు)కొలికి[4] సుభటండు(ఎ)న[5]
            పోతికేతనల[6] ప్రీతితమ్ముం
డిహలోకమున సుఖ వింతియ[7]సాలు వొ
            మ్మని తల్లిదండ్రిని నత్లం[8] దలంచి
మదనసద్రిశుండు (కా)వన దివియప్రోలం[9]
డమరపురమున కర్తితో నరుగుచుండి
కొలనిసోమేస్వరునకును సలలితముంగా
సంధ్యదీపంబు వెటించ్చె సస్వతముంగ.


వరనాలుగు సిదెడసెట్టగోత్రవిలసద్ధిరుద్రసఖ్యల సురచితముగ సరసీపు

(అసంపూర్ణము)

—————

  1. "ధరాధీశవత్సరములు" అని యుండవలెను.
  2. రుంద్రశబ్డ మిచ్చట కుదురదు. ఒకటి యను నర్థమిచ్చు వేఱొకశబ్ద ముండవలయును
  3. "సంఖ్య" అని యుండవలెను.
  4. "కలికి" అని యుండనోపు.
  5. "భటుండెన" అని యుండనోపు.
  6. "కేతనలకు" అని యుండనోపు.
  7. "మింతియ" అని యుండనోపు.
  8. "నల్ల" అని యుండవలెనేమో.
  9. ఈపాదమందు చందోభంగము కలిగినది.