పుట:Saptamaidvardu-Charitramu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

సప్త మైడ్వర్డు చరిత్రము.



పదునొ కం డ వ య ధ్యాయము,

ఎడ్వర్డు అవసానదశ. మరణము

.

1910 సం. న "మే నెల 5 తేదిని ఎడ్వర్డు మిక్కిలి జబ్బుపడి నాడనియును, పరదేశమునకు వెళ్లి ఇంటికి నేతెంచు తన భార్య నెదుర్కొనఁ బో నశక్తుఁ డై యుండెననియును, వైద్యులు తెలి యఁ జేసిరి. ఫ్రాన్సులో నుండు క లేలో నుండిన అలెగ్జాండ్రా, తన భర్త వ్యాధిపీడితుడై నాడని విన్నదై యెకాయెకిని దారిలో కుంభ ద్రోణవర్షము కురియు చుండినను, ఆవానలోనే లండను పురికి విచ్చేసెను, వైద్యులు “అమ్మా! మీభర్తగారి శ్వాసకో ములు కొంచెము చెడి యున్నవి . శీఘ్రముననే భగవంతుఁ డాయనశ్రమను నివారణ సేయగలడు.” అని మందలించిరి. అయిల్లాలు ఇంతకుముందు నాతఁడు వ్యాధిగ్రస్తుడైనపుడు దేవుని నమ్మినందున నాతఁడు స్వస్థచిత్తుఁ డయ్యెనని తలఁచి 'భగ వంతుడే" తన నాథుని మేన బ్రాణముల నిలుపు సని మిక్కిలి విశ్వసించి యుండెను. కాలము సమీపించి నప్పుడు, దేవుడేమి చేయఁగలఁడు? నాటి రాత్రి రోగము ముదురు చుండెను, వైద్యులు దాని నాప సర్వవిధంబులఁ బ్రయత్నించు చుండిరి.


ఎడ్వ ర్డింత జబ్బు స్థితిలో నుండిను, పడక నుండి లేచి భగ వంతుని స్మరించి, రాచ కార్యములు నిర్వర్తింపు చుండెను. అతని ప్రాణమిత్తుఁ డైన నాలిస్సుప్రభు వాతనిఁ జూడ నేతెం