పుట:Saptamaidvardu-Charitramu.pdf/172

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండన ప్రకరణము.

175


చెను. ఎడ్వర్డు లేచి తనమిత్రుని గాఢాలింగనము గావించు కొని, యతని యోగ ముల నారసి కూర్చుండ నియమించి యతనితో ముచ్చటలాడుచుఁ బొద్దు పుచ్చుచుండెను. కాని వైద్యులు “రాత్రి "రాజు బాగుగ నిదుర పోయెను. అయినను రోగముమాత్ర ముపశమింప లేదు". అని వక్కాణించు చుండిరి. ఎడ్వర్డు దైర్య లక్ష్మీని వదలక తన్నుఁ గన వచ్చిన మిత్రా మాత్యులను గారవించి, వారితో దూరమున నుండు చెలికాం డ్రకును, బంధువులకును, జాబులు వ్రాయవలయు నని చెప్పి, తాను బ్రదుకుట దుర్లభంబని కొన్ని యేర్పాటులు సేయఁ దలంచెను. ఆరుస కుమారుఁడును, పుత్రికలును, మనుమలును, మనుమరాండ్రును, ఆయనను జుట్టియుండిరి. కాని అతని కడపటి ముద్దుకూఁతురు మాత్రము నార్వేకు వెళ్లి యుండెను. ఆచిన్నదీ తండ్రి జబ్బుస్థితిని విన్న దై బిరబిర వచ్చినను, ఆమె తండ్రిని జూడనే లేదు. వైద్యులు మే నెల 7 వ తేది ఉదయమున 7 ఘంట' లప్పుడు, “ రాజు బ్రతుకుజాడలు కాన్సింప లేదు; అతఁడిప్పుడు నదే స్థితిలో ఉన్నాఁడు. " అని చెప్పిరి.

బకింగు హాము భవనంబునకు నలుగడల న నేకులు గుంపు లు గూడి పైవార్తను విని దిగు లొందిన హృదయము కలనా రై నివ్వెరపడి యుండిరి.

ఎడ్వర్డు భాస్క.రు డస్తమించు నని చెప్పురీతిని నాఁడు సూర్యుఁ డపరదిక్కున నొడిగెను. సంధ్యా రాగము మిన్ను నఁ