పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండ వేంకటప్పయ్య సంగ్రహ ఆంధ్ర


గోల్కొండనవాబు ఈస్టిండియా కంపెనీ వారికి కొండ వీడును 1788 సెప్టెంబరులో అప్పగించెను. అప్పటినుండి కొండవీడు గుంటూరుజిల్లాలో చేర్చబడి, కొండవీటి నుండి కార్యస్థానము గుంటూరునకు మార్చబడినది. కొండవీ డొక తాలూకా కేంద్రముగా నుండినది. 1197వ ఫసలీలో ప్రభుత్వమువారు జమీందారులకు జమీలు పంపిణీ చేసిరి. అపుడు కొండవీడు చిలకలూరు పేటలో చేరిన శ్రీ రాజా మానూరి నరసన్నారావుగారికి సంక్రమించి, 1812 వరకు వారి వంశ్యుల స్వాధీనములో ఉండినది. జమీనుదారులకు అలవెన్సులు ఏర్పడినపుడు కొండవీడు రాష్ట్ర దొరతనము వారి పాలనముక్రిందకు వచ్చినది. కాలక్రమమున కొండ వీడు తాలూకా స్థానమును గూడ కోల్పోయి, ఒక గ్రామమై, తుదకు క్షీణించిపోయి, ఒక పల్లెగా మారినది. కా. సి.

కొండ వేంకటప్పయ్య :
కీ. శే. దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులుగారు ఆంధ్రజన మణిహారమున నాయకమణియై వరలెను. పంతులుగారి వినయసంపత్తి, మానవ సేవాసక్తి, స్వతంత్ర కార్యాచరణశక్తి, దేశ సేవానురక్తి, ధైర్యోత్సాహ స్వార్థత్యా గౌదార్యములు మున్నగు నుత్తమ గుణములు వారు న్యాయవాది శిరోమణిగా, రాజకీయతంత్రవిశార దుడుగా, ఆంధ్రోద్యమ జనకుడుగా, దేశభక్తాగ్రేసరు డుగా రూపొందుటకు ప్రకృష్టోపకారకములయ్యెను. గుంటూరు పట్టణమునందు ఒక బ్రాహ్మణ వంశము నందు కొండ అప్పయ్య అను మహాశయుడు ఉదయమం దెను. అతడు వాసిరెడ్డి వారి సంస్థానమున రాజోద్యో గిగా నుండెను. అతని కొడుకు కోటయ్య. ఆతనికి పిత్ర ముగా 15 ఎకరముల భూమి సంక్రమించెను. దాని పై రు. 80 ల ఆదాయము మాత్రమే లభించుచుండుటచే, ఆత డొక వైశ్యు నొద్ద ఉద్యోగిగ పనిచేయుచు తిమ్మ రాజు గోపాలరావుగారి కూతురు బుచ్చమ్మ యను నామెను పెండిలియాడెను. ఆమె పరమసాధ్వి. సూర్యా రాధనతత్పర. రవిని జూచి గాని కుడువ నొల్లనిది. కాల క్రమమున బుచ్చమాంబా కోటయార్యుల నోములపంటలై వేంకటప్పయ్య, సూర్యనారాయణ, ఆదినారాయణ అను ముగ్గురు కుమారు లుదయించిరి. వారిలో వెంకటప్పయ్య

గారి శుభ జనన దినము 1866 సంవత్సరము ఫిబ్రవరి 2వ శుక్ర వారము. బుచ్చమ్మ తన 30వ యేటనే పరమ పదించెను. ఉపనీతులై యున్న వేంకటప్పయ్యగారే తల్లి గారి పరలోక క్రియలను నిర్వర్తించిరి.

పువ్వు పుట్టగ నే పరిమళించు నన్నట్లు వేంకటప్పయ్య గారు విద్యాభ్యాసదశ నుండియే తమ ప్రతిభను ప్రదర్శింప దొడగిరి. వారు తొలుదొల్త ఒక మౌల్విగారి పాఠశాలలో ఉరుదు భాష నభ్యసించిరి. పిదప ఒక ఆంగ్లేయ పాఠ శాలలో ఆంగ్ల భాషాభ్యాసము నారంభించిరి. 1883 సం. డి సెంబరు మాసమున రాజమహేంద్రవరములో మెట్రిక్యు లేషను పరీక్షయందు కృతార్థులైరి. అంతకు పూర్వము ననే పంతులుగారు ఒక పాఠశాలా వార్షికోత్సవ సందర్భ మున తమ వినోదకర సంభాషణ కౌశల్యముచే సభ్యు లను హర్షాశ్చర్య మగ్నుల నొనర్చిరి. ప్రతి కథ్యయందును ఉన్నత శ్రేణిలో కృతార్థత నొందుచు నిరంతర విద్యార్థి వేతనమును, పుస్తకరూప బహుమానములను పొందు చుండిరి. రాజమహేంద్రవరమున నున్నప్పుడు వారికి కీ. శే. కందుకూరి వీరేశలింగముగారి దర్శనలాభము చేకూరెను. ఆంధ్ర భాషాధ్యాపకులగు కొండుభట్ల సుబ్ర హ్మణ్య శాస్త్రిగారి ప్రోత్సాహముచే, తెలుగు నాట కములలో ప్రముఖమైన స్త్రీ పాత్రను సమర్థతతో నటించి ప్రేక్షకుల ప్రశంసలను చూరగొనిరి.

తమ సహపాఠియగు చంద్రశేఖరమను నాతనికి చికిత్స

చేయించిన సందర్భమున కుగ్లరు దొరసానితో వారికి పరిచయ మేర్పడెను. ఆమెయొక్క సంఘసేవ, దైవభక్తి మున్న గుగుణములచే ఆకృష్టులైన పంతులుగారు క్రైస్తవ మతాభిమానులు కాసాగిరి. క్రైస్తవమత ప్రవిష్టులయి యుందురు; కాని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రిగారి చే బోధితులై క్రైస్తవమత స్వీకరణోద్యమమునుండి విముఖులై 8. ఉన్నత విద్యాభ్యాసము: పంతులుగారికి క్రైస్తవ మతమునందు జనించిన అభిరుచి పెంపొందు అవకాశము లేకుండ తండ్రిగారు వారిని ఎఫ్. ఏ. తరగతిని రాజ మహేంద్రవరములో చదువునట్లు ఏర్పాటు కావించిరి. కాని ఎఫ్. ఏ. రెండవ సంవత్సరపు చదువు సాగించుటకు పంతులుగారు మద రాసులో క్రైస్తవ కళాశాలలో ప్రవే శించి, మితవ్యయ మొనర్చుచు, కుగ్లరు దొరసానిగారు 56