విజ్ఞానకోశము - 3
కొండ వేంకటప్పయ్య
తమకు పంపదొడగిన విద్యార్థి వేతనమును సహపాఠియగు చంద్రశేఖరమున కొసగుచు, అఖండమైన ఔదార్యమును ప్రకటించిరి. అచటి విద్యార్థిదశయందే వారు తెనుగున కవిత్వము వ్రాయదొడగిరి. బి. ఏ. పరీక్షలో కృతార్థులు కాకముందే వారు లింగమగుంట కోదండ రామయ్యగారి కన్యారత్నము, వేంకట సుబ్బమ్మగారిని ధర్మపత్నిగా స్వీకరించుట తటస్థించెను.
బి. ఏ. తరగతిలో చదువుచున్న కాలముననే వేంకటప్పయ్యగారు కళాశాల విద్యార్థి సంఘ చర్చలలో అగ్రగణ్యులుగ పేరొందిరి. ఉపన్యాసకరణమున లబ్ధవర్ణులైరి. షేక్స్పియరు నాటక ప్రదర్శనావసరములలో తాము స్వీకరించిన పాత్రకు అనుగుణముగ ఉచ్చారణ మొనర్చుచు, హావభావాదికముల ప్రదర్శించుచు, నిరుపమానమైన ప్రజ్ఞాకౌశలమును ఆవిష్కరించిరి. అత్తరి వారు అలవరచుకొనిన సుగుణగణమే ఉత్తరకాలమున వారు ఉత్తమన్యాయవాదిగ నిర్మించుకొనిన కీర్తిసౌధమునకు పునాదియై వరలెను. ఒకనాడు ప్రొఫెసరు లాయిడ్ అనునాతడు బైబిల్ పాఠము చెప్పుచు హిందూమతమును దూరిన కారణముగా విద్యార్థులచే గొప్పసమ్మె జరుపబడెను. ఆ సమ్మెయందు అత్యుత్సాహ ధైర్యములతో ప్రధాననాయకత్వమును వహించిన వారు పంతులుగారే.
1887 సంవత్సరము డిసెంబరులో అచట జరిగినభారత కాంగ్రెసు తృతీయ సమావేశ సందర్భమున పంతులుగారు ఐచ్ఛికభటులుగా స్వీయకృత్య నిర్వహణమున అత్యంత సామర్థ్యమును వ్యక్తీకరించిరి. పై సందర్భములలో పంతులుగారు అలవరచుకొనిన గుణములే, నిరుపమానమైన వారి భావి దేశ నాయకత్వమునకు రాచబాట వైచినవి.
బి.యల్. పరీక్షాఫలితములు తెలియకమున్నే పంతులుగారు సబ్ రిజిస్ట్రారుగా నియమింపబడిరి. కాని వారు దానిని స్వీకరింపక, న్యాయశాస్త్ర పట్టభద్రులయిన వెంటనే బందరులో తమ న్యాయవాద వృత్తికి విఘ్నేశ్వరపూజ గావించిరి. పంతులుగారి హస్తము పరుసవేదియై వారు పట్టిన దెల్ల బంగారమగు చుండెను. ప్రప్రథమమున వారొక ఖూనీ కేసునందు ముద్దాయి పక్షమున ప్రచండముగ వాదించి గడించిన అఖండ విజయమే పిదప న్యాయవాదిగా వారికి చేకూరిన కీర్తి ప్రతిష్ఠలకు జయ పతాక యయ్యెను.
చిత్రము - 8
న్యాయవాద వృత్తి నవలంబించిన మూడు సంవత్సరములకు పిదప వెంకటప్పయ్యగారు కృష్ణాజిల్లా కాంగ్రెసుకు సభ్యులుగను, కార్యదర్శిగను పనిచేయుచుండిరి. 1896లో కృష్ణానది వరదలు కారణముగా అవనిగడ్డతాలూకా గ్రామములు నీటిలో మునిగి పోయెను. ఐన నేమి ! పంతులుగారు అకుంఠిత ధైర్యస్థైర్యసమయస్ఫూర్తులతో వలసిన ద్రవ్యమును భూరివిరాళ రూపమున ప్రోగుచేసి, బాధిత గ్రామజనులకు పడవలపై నెత్తించిన సరకులను స్వయముగా సరఫరా చేయించి తమ దయామయత్వమును, అప్రతిహతోత్సాహమును, కర్తవ్యదీక్షను, మానవ సేవాతత్పరతను ఆవిష్కరించిరి. అట్లే ఒకతూరి రాయలసీమలో కరువు సంభవించగా, అచటికి వారు స్వయముగా వెళ్ళి పర్యటించి, చవుక బియ్యపు దుకాణములను ఏర్పాటు గావించి, నూతులు, కాలువలు త్రవ్వించు నిర్మాణ కార్యకలాపములందు పరిశ్రమించి తమ ప్రజాహితైక తత్పరతను వెల్లడించిరి.
కృష్ణాజిల్లానుండి గుంటూరుజిల్లా కొత్తగా ఏర్పడిన పిదప పంతులుగారు గుంటూరునందే న్యాయవాదిగా ప్రవే
57