Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/811

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చైనాదేశము (చ)

చిత్రము - 218

పటము - 3

చైనా ప్రాచీన శిల్పము, డగోబా

ప్రాచీన ధర్మసూత్రములను క్రోడీకరించి మానవతా వాదము పునాదిగా, విశిష్టమైన సాంఘిక రాజకీయ తత్త్వమును, కన్‌ఫ్ఫ్యూషియస్ ప్రతిపాదించినాడు. ప్రశాంతమైన కుటుంబమునకు ఆధారమైన సహనము, సామరస్యము, సౌమనస్యము, విశ్వాసము, భక్తిప్రపత్తులు మొదలైన గుణములే ప్రజలందరిలోను, ప్రజలకును ప్రభుత్వమునకును మధ్య ఏర్పడి నప్పుడే మానవుడు సుఖముగా జీవింపగలడు. ప్రపంచము శాంతిధామము కాదు అనునదే కన్‌ఫ్యూషియస్ తత్త్వములోని సారాంశము. కన్‌ఫ్యూషియస్ రచనలను నిన్న మొన్నటి వరకును చైనాలో కంఠస్థము చేయుచుండెడి వారు. చైనా విద్వత్తుకు అదియే గీటురాయియై యుండెను.

కన్‌ఫ్యూషియస్ సమకాలికుడైన లౌజే (Laotse) టోయీ మతమును (Toism) స్థాపించినాడు . ఈ మతస్థులకు లౌజే రచించిన లావోటి కింగ్ (పవిత్రమార్గము) అను గ్రంథమే వేదము. ఇందలి సిద్ధాంతములు చాలవరకు హేతువాద బద్దము లయినవి. లౌజేకూడ శీలమునకు ప్రాధాన్యము నిచ్చెను. కాని సంప్రదాయ సిద్ధములైన మూఢాచారముల పట్ల విశ్వాసమే సమస్త అనర్థములకు కారణమని అతడు చాటెను. అందుచేతనే కన్‌ఫ్యూషియస్ సంప్రదాయవాదులకును, లౌజే విప్లవవాదులకును మార్గదర్శకులైరి.

టోయీ మతముకంటె, చైనాలో కన్‌ఫ్యూషియస్ సిద్ధాంతములే ప్రజాదరణమును పొందినవి.

చిత్రము - 219

పటము - 4

కన్‌ఫ్యూషియస్

అందుకు మెన్సియస్ (క్రీ. పూ. 372-289), హ్సుజు (క్రీ. పూ. 320 - 285), అను దార్శనికులు కారణము. వీరు కన్‌ఫ్యూషియస్ సిద్ధాంతములకు వ్యాఖ్యానములు రచించి ప్రజలలో ప్రచార మొనర్చిరి. “మానవుడు సహజముగా నీతిపరుడు. అవినీతికి దుష్టశక్తుల ప్రభావమే కారణము. ప్రేమ, ధర్మము, నశించినప్పుడు మానవులను మృగములు భక్షించుటేగాక, మానవు లొకరి నొకరు భక్షింతురు” అని మెన్సియస్ బోధించెను. హ్సుజు సిద్ధాంతములకును భారతదేశములోని చార్వాక దర్శనమునకును పోలిక లున్నవి.

బౌద్ధము : ఈ మతములకు తోడుగా, ఇండియానుండి

747