కేరళదేశము - (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
మన శరీరములో ఇనుము, కాల్షియము, అయోడిన్ మున్నగు అనేక మూలకములు ఉండును. చాలకాలము వరకు శరీరములో ఏ నిర్దిష్ట (particular) భాగమునందు అయోడిను ఉండునో గుర్తించుట కష్టమయ్యెను. నేడు ఒక వ్యక్తికి రేడియో అయోడీనును ప్రయోగించిన యెడల, ఇది తిన్నగా సాధారణపు అయోడీను ఉండుతావునకు సరిగా పోవును. ఎందుచేతనన, ఈ రెండును సస్థానికము (isotopes) లగుటచే రసాయనికముగా సర్వవిధముల సదృశములై యుండును. రేడియో అయోడినును, దాని రేడియో ధార్మిక శక్తిని బట్టి G. M. కౌంటరు సహాయమున సులభముగా గుర్తింపవచ్చును. దానిని బట్టి అయోడిను యొక్క స్థానమును కనిపెట్టవచ్చును. ఈ విధముగా గళ గ్రంథి (thyroid gland) యొక్క స్వస్థతకు తగుమాత్రపు అయోడీను ఆవశ్యకమని కనుగొనబడెను. అయోడిను, భాస్వరము, గంధకము, కర్బనము, సోడియము అనువాటి యొక్క ఐదు రేడియో సస్థానకములు (isotopes) వైద్యసంబంధమైనట్టియు, శరీర సంబంధమైనట్టియు, జీవ సంబంధమైనట్టియు పరీక్షల యందు గుర్తించు సాధనములు (traces) గా విస్తారముగా వాడబడుచున్నవి. శోధక (గుర్తించు) నైపుణ్యము చెట్లలో జరుగు ఈ క్రింది ప్రతిక్రియ లందును, పరిశ్రమలందును విస్తారముగా ఉపయోగింపబడుచున్నది. జాగ్రత్తగా తయారుచేయబడిన జింకు సల్ఫైడుతో గూడిన రేడియో ధోరియము (L కణములను బయలు గ్రక్కునది) యొక్క మిశ్రమము శాశ్వతమగు ప్రకాశమును కలిగించును. అది గడియారములో అద్దుటకు ఉపయోగపడుచున్నది.
రేడియం నుండి వెడలు ౪ (గామా) కిరణములు, ఆరోగ్యముగా నుండు చర్మమునకు అపాయకరములై నప్పటికిని, కాన్సరు వంటి వ్యాధులను కుదుర్చుటకు ఉపయోగపడుచున్నవి. రేడియో కోబాల్టు (cobalt) ఇదే విధమగు ౪ కిరణములను వెడలించును కనుక అది ఇప్పటికిని గ్రాము ఒకటికి రు. 65,000 ల విలువ గల రేడియం యొక్క స్థానములో అమోఘమును, చౌకయు నగు ప్రత్యామ్నాయముగా వాడబడుచున్నది.
వి. వి. వ.
కేరళదేశము - చరిత్ర :
ప్రాచీన కేరళము: ఐతరేయారణ్యకమునందు ' చేర 'అను పదము కనిపించుచున్నది. చేరులు కొన్ని ప్రాచీన నియమములను ఉల్లంఘించిన మూడు తెగల ప్రజలలో ఒకరుగా పేర్కొనబడి యున్నారు. దక్షిణాపథమునందలి ఇతర జనుల ఆచార వ్యవహారములనుండి కేరళీయులు బహుళముగా అతిప్రాచీనకాలములోనే విడిపోయి యుందురు. రామాయణమునందును, మహాభారతమునందును,' కేరళ' అను పేరు కలదు. సుప్రసిద్ధ వైయాకరణియగు కాత్యాయనుడు (క్రీ.పూ. 4 వ శతాబ్దము) కేరళమును పేర్కొని యున్నాడు. కాళిదాసు కాలమువరకే 'కేరళ' అను నామము ఈ ప్రదేశమునకు రూఢియై యుండెనని ఆతని రఘువంశమున గల “భయోత్సృష్ట విభూషాణాం" అను శ్లోకమువందలి ' కేరళ యోషితాం' అను సమాస ప్రయోగముచే స్పష్టమగుచున్నది. గ్రీకులు చారిత్రక గ్రంథములలో 'కేరబోత్రాస్' (Kerabothras) అను భారతీయ పరిపాలకుడు పేర్కొనబడినాడు. అశోకుని రెండవ శాసనము, పదమూడవ శాసనము (Edict) ప్రత్యంత రాజ్యముల పట్టికలో కేరళ పుత్రుల రాజ్యమును పేర్కొను చున్నవి. గ్రీకుల దూత యగు మెగస్తనీసు చేర రాజ్యమును, ఆ దేశపు నాయర్లను పేర్కొనియున్నాడు.
పరశురాముని పరశు ప్రహారమువలన సముద్రము నుండి తేలిన భూభాగము 'కేరళ' అని ఒక గాథ నుడువుచున్నది. దీనికి కేరళ తీరభాగము యొక్క నైసర్గిక స్వరూపమే కారణమైయుండును. 'కేరళ'ను పరశురామ క్షేత్రమని సంకల్పమునందు పేర్కొనుటయు గలదు. చారిత్రకముగా ఇది యెంతవరకు సత్యమో తెలియదు. రఘువంశమున 4 వ సర్గయందు గల 53, 58 శ్లోకముల వలన పరశురాముని అస్త్రముచే అపరాంత దేశము సముద్రమునుండి ఉత్సారిత మయిన దను గాథ కాళిదాసుని కాలముననే ప్రసిద్ధమైయుండెనని తెలియుచున్నది భూగోళ శాస్త్రజ్ఞులు మాత్ర మొక కాలమున సముద్రభాగమగు ఈ ప్రదేశము సముద్రము వెనుకంజ వేసినందున తేలిన భూమియని సిద్ధాంతపరచిరి. పూర్వము సముద్రము పశ్చిమ కనుమల పాదములవరకు వ్యాప్తమై యుండెను. తదుపరి అనేక నైసర్గికములయిన మార్పులవలనను,
24