గుణాఢ్యుడు . సంగ్రహ ఆంధ్ర
బృహత్కథా ప్రాశస్త్యమునుగూర్చి యొకింత తెలిసి కొందము. ఈ గ్రంథము పైశాచీ ప్రాకృతమందు రచింప బడెను. అపూర్వ విచిత్ర కథా కావ్యసృష్టి కలదగుటచే పలువురు ప్రాచీన సంస్కృతకవులచే అనేక విధములుగా శ్లాఘింపబడెను, భట్టబాణుడు, “సముద్దీపిత కందరాకృత గౌరీ ప్రసాదనా హరవీలేవ నో కస్య, విస్మయాయ బృహత్కథా."
అని ఆ గాథాసంపుటిని పరమేశ్వరుని లీలాత్మక ముగా వర్ణించెను. దండిమహాకవిచే "భూత భాషామయీం ప్రాహురద్భుతార్థం బృహత్కథాం" అని అద్భుత కథార్థములు కలదిగా కొనియాడబడెను. గోవర్ధనా చార్యుడు ఆర్యాస ప్తశతియందు, "అతిదీర్ఘ జీవి దోషాద్వ్యా సేన యశోపహారితమ్, కైర్నోచ్యేత గుణాఢ్యస్స ఏవ జన్మాన్తరాపన్నః"
అని గుణాఢ్యుని వ్యాసుని యొక్క అవరమూ ర్తిగా కీర్తించెను. కాళిదాసు మేఘ సందేశములో ఉదయనుని క థా ప్రసంగమున బృహత్కథా ప్రశస్తిని ఇట్లు స్మరించెను. "ప్రాప్యావ స్తీ ముదయన కథాకోవిద గ్రామవృద్ధాన్.” సుబంధుడు వాసవద త్తలో “బృహత్కథాలమ్బైరివ సాల భంజికానివ హైః" అని ప్రశంసించెను. త్రివిక్ర మభట్టు నల చంపువులో, "శశ్వద్బాణ ద్వితీయేన నమదా కార ధారిణా ధను షేవగుణాఢ్యాన నిశ్శేషోరంజితో జనః"
అని పొగడెను. బాణ ద్వితీయుడగు గుణాఢ్యునిచే అశేష జనము ముగ్ధమగునట.
బృహత్కథకంటే ప్రాచీనమగు కథాసంపుటి మరి యొకటి లేదని చెప్పియుంటిమి. కథావస్తువుతో బాటు రసపోషణాదికము కూడ దీనియందు చక్కగా నిర్వ హింపబడెను. పూర్తి గ్రంథమందు సప్త విద్యాధర చక్ర వర్తులకు సంబంధించిన కథలు అభివర్ణింపబడియుండును. కాని ఒకప్పుడు ఉపలబ్ధమానమైన ఈ సప్తమాంశమందు ఉదయన మహారాజు యొక్క కుమారుడగు నరవాహన దత్తుడు నాయకుడు. అతడు తన మిత్రుడగు గోముఖుని సహాయమున మదనమంజూష యను ప్రేయసిని పాణి గ్రహణ మొనర్చి విద్యాధర సామ్రాజ్యమునకు అధి పతి యగును. ఈ నరవాహనదత్తుడు ఇంకను అనేక దివ్య చదు మానుషాంగనలను వి వాహమాడును. ఈ కథావస్తువునకు అనుబంధముగా ప్రాసంగిక గాథలు చిన్నవి, పెద్దవి అనేక ములు కూర్చబడెను. అవి ఆయా సందర్భములకు తగిన వియై, పాఠకులకు, శ్రోతలకు ఎంతయో అభిరుచిని పెంపొందించుటయే ఈ గ్రంథము యొక్క విశిష్టత కనుక, ప్రధాన కథ అతి మందముగా నడచుచు, అవాంతర కథలే మిక్కిలి మనోహరములైయుండును. అనవసర వర్ణన ములు గాని, అసందర్భత్వము గాని కథల యందు కాన్పిం రామాయణ, మహాభారతముల వలె, అంతటి ఉత్కృష్టమగు ప్రధాన కథావస్తువు లేకున్నను, బృహ త్కథ యొక్క ప్రభావము తరువాతి కథా సాహిత్యము నందు విశేషముగా కాన్పించును. క్రీ. పూ. 2వ శతాబ్ది లోని భాసమహాకవి కృతములగు ప్రతిజ్ఞా యౌగంధ రాయణము, చారుద త్తము, స్వప్న వాసవ ద త్తము అను రూపకము లందలి క థావస్తువు బృహత్కథ లోనిదియే. బృహత్కథలోని గోముఖుడు యౌగంధరాయణుడుగాను, మదనమంజూష వసంత సేనగాను. రూపొందించబడినది. అట్లే శ్రీహర్షుడు కూడ తన నాటకముల కవసరమగు ఇతి వృత్తమును ఇందుండియే గ్రహించెను. ముద్రారాక్షసము బృహత్క థామూలకమని ధనికుడు స్పష్టముగా వ్యాఖ్యా నించెను. ఇంతేగాక పంచతంత్రము, హితోపదేశము, దశకుమార చరిత్రము, భేతాళ పంచవింశతి విక్రమార్క చరిత్రము, శుకసప్తతి మున్నగు కథారచనల యందు ఆయా కృతికర్తలకు కృతిక ర్తలకు బృహత్కథయే మార్గదర్శకమనుట అతిశయోక్తి కాజాలదు. భట్టబాణుని కాదంబరికి బృహ త్కథయే మూలమని స్పష్టముగా తెలియుచున్నది. బృహత్కథ యొక్క పైశాచీ మూలగ్రంథము నేడు అదృశ్యమైపోయినను క్రీ.శ. 12వ శతాబ్ది వరకు అది యథాతథముగా ఉండియుండవచ్చునని ధనంజయాదుల ప్రశంసా వాక్యములను బట్టి ఊహింప వీలగుచున్నది. ప్రస్తుతము ఈ మహా గ్రంథము యొక్క సంస్కృతాను వాదములు మాత్రము మూడు లభ్యమగుచున్నవి : ఈ 1. నేపాలు దేశీయుడగు బుధస్వామి కృతమగు 'బృహ త్కథా శ్లోక సంగ్రహము'. ఈ గ్రంథకర్త క్రీ.శ. 8 లేక 9 వ శతాబ్దికి చెందినవాడు. ఇదియే మిగిలిన అనువాద ములు రెండింటి కన్న ప్రాచీనమైనది. దీనికి నేపాలు దేశ