క్రికెట్
సంగ్రహ ఆంధ్ర
ములలో భారతదేశము ఇంగ్లండును ఓడించెను. ఇదిచాలా గొప్ప విజయముగా వర్ణింపబడి యున్నది.
చిత్రము - 29
పిమ్మట 1952 లో భారతజట్టు పాకిస్తాన్ మీదను, అనంతరము న్యూజిలెండుమీదను విజయములు గాంచెను. అటుపిమ్మట ‘వెస్టు ఇండీస్ ' జట్టుతో భారతదేశమందును, వారి సుందరమయిన మాతృదేశమందును (కార్రిబియన్ దీవులు) మన జట్టు తలపడి క్రికెట్ పందెములాడెను. ఇట్లే 1947 లో గూడమనజట్టు ఆస్ట్రేలియాకు ప్రయాణమై పోవుట సంభవించెను.
ఇట్లు భారత దేశపు జట్టులో ఆదినుండి పెక్కురు క్రికెట్ ఆటగాండ్రు తమ పాత్రను ప్రశంసనీయముగ నిర్వహించిరి. వీరి కృషి లేనిదే, భారతదేశములో క్రికెట్ ఆటకు ఇంతటి ఘనత చేకూరెడిది కాదు. వీరిలో పూర్వతరమునకు చెందిన 'మిస్ట్రీ' ఈ తరమునకు చెందిన 'మంకాడ్ ' అను క్రికెట్ యోధులును, వీరి సహచరులును, అనుచరులును గూడ అఖండ కీర్తి నార్జించిరి. మిస్ట్రీ ఎడమచేతితో అతి నైపుణ్యముతో 'బౌలింగ్ ' చేయగలిగినఆటగాడు. ఇతడు 1910 - 1920 సం. నడుమ తక్కిన యాటగాండ్రలో అందరికంటె అధికమైన కీర్తి ప్రతిష్ఠలనార్జించెను. మిస్ట్రీ సమకాలికుడైన 'బాలూ' కూడ ప్రేక్షకులను ఆశ్చర్యచకితులనుగా చేయు తన ఎడమచేతి 'బౌలింగ్' వలన తన సహచరులైన ఆట గాండ్రమీద మిస్ట్రీవలె సమానమయిన ప్రభావము కలుగజేసెను. ఇదే కాలమున డా. కంగా, జయరామ్ మెహరోంజీ ప్రభృతులు ప్రదర్శించిన నైపుణ్యము, మిస్ట్రీ, బాలూలు ప్రదర్శించిన నైపుణ్యమునకు తీసిపోవునది కాదు.
తరువాతి తరమునకు చెందిన క్రికెట్ ఆటగాండ్రలో
చిత్రము - 30
చిత్రము - 31
చిత్రము - 32
132