Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్రికెట్ 130 సంగ్రహ ఆంధ్ర


ప్రాచీనమైన ఒక ఆట ఇప్పటికిని వాడుకయందున్నది. గ్రీసుదేశములో లభ్యమయిన పురాతత్త్వ శిథిలముల ఆధారమున, ప్రాచీన కాలమందు హాకీ - క్రికెట్ మిశ్రిత మగు ఒక విచిత్రమైన ఆట ఆడబడుచుండెడిదని తెలియు చున్నది. ఆనాడు ప్రపంచము ఇంత అభివృద్ధికి రాక, ప్రాథమికదశయందే యుండెను. కర్రకు (Bat) బంతికి (Ball) సంబంధించిన ఇట్టి ఆటలను గ్రీసుదేశమునుండి అలెగ్జాండర్ తనవెంట భారత దేశమునకు కొని వచ్చి నటుల మన మూహింపవచ్చును. ఇందులు కాధారములు గూడ కొన్నిగలవు.

బ్రిటిష్ వారు భారతభూమి మీద అడుగిడిన వెంట నే, క్రికెట్ కూడ వారితో ఇచట ప్రవేశమొనర్చిరి. బ్రిటిష్ యువసైనికులు తాము ప్రవేశించిన ప్రతి దేశమునకు తమ క్రీడా పరికరములను తమవెంట తీసుకొని వెళ్ళుట వారికి పరిపాటియయ్యెను. ఏ చెట్లయినను క్రికెట్ ఆట మొట్టమొదటిసారిగా భారత దేశమున 1751 వ సం॥ననే ప్రారంభమయినది. గ్రేట్ బ్రిటన్ వెలుపలనున్న దేశము లన్నిటిలో కలకత్తాలో స్థాపింపబడిన క్రికెట్ క్లబ్ అత్యంత ప్రాచీనమైనదని తెలియుచున్నది. ఈ క్లబ్బు 1792 లో నెలకొల్పబడినది. కలకత్తా క్రికెట్ క్లబ్బు, బారక్ పూర్ క్లబ్బుల మధ్య నొక ఆటయు, కలకత్తా క్రికెట్ క్లబ్, డండం క్లబ్బుల మధ్య మరియొక ఆటయు జరిగినది. కలకత్తా క్రికెట్ క్లబ్బును టి. సి. లాంగ్ ఫీల్డ్ అను నాతడు అభి వృద్ధిపరచెను. ఈస్ట్ ఇండియా కంపెనీయందు పనిచేసిన ఉద్యోగులే ఈ క్లబ్బులయందును పాల్గొనెడివారు.

అయినను క్రికెట్ ఆటకు బొంబాయి నగరము పుట్టి నిల్ల ని విశిష్టమయిన ప్రఖ్యాతికలదు.. ఇందుకు కారణ ములు రెండు : ఈ ఆట బొంబాయినగరములో అత్యంత మైన ప్రజాదరణ గడించుట; మరి ఏ ఇతర నగరము నందునులేని ఉద్దండులయిన క్రికెట్ ఆటగాండ్రు ఈ నగర మందే వన్నె కెక్కియుండుట. క్రికెట్ ఆటను చేపట్టి, దానిని అభివృద్ధిపరచి ప్రథమస్థాన మాక్రమించుటలో ఇతర జాతులవారికం టే పార్శీజాతివారు అత్యంత గౌరవ స్థాన మలంక రించియున్నారు. వారు 'ఓరియంటల్ క్రికెట్ క్లబ్బు'ను 1848 లో మొట్టమొదటిసారిగా స్థాపించిరి. ఆ దినములలో క్రికెట్ 'ను 'బాట్బాల్' (Bat ball) ఆట యని సామాన్యులు పిలిచెడివారు. అటుపిమ్మట 1859లో 'జొరాష్ట్రియన్ క్రికెట్ క్లబ్బు' ఏర్పడెను.

1867 సం॥ ప్రాంతములో 'రౌండ్ ఆరమ్ బౌలింగ్' (Round arm bowling) అను సాంకేతిక విధానము క్రికెట్ ఆటలో అమలునందుండెను. ఇంగ్లండులోని 'సరే' (Surrey) నగరము నుండి రాబర్ట్ హెండర్సన్ అను నతడు బొంబాయికివచ్చి, పార్శీ క్రికెట్ ఆటగాండ్రకు శిక్షణ నిచ్చెను. క్రికెట్ అటగాండ్రు ఇప్పటికిని అతని నామమును స్మరించుచు, అతనియెడల కృతజ్ఞ తాభిమాన ములు వెలిబుచ్చుచుందురు. ఈ సంఘటనమువలన నే ప్రథమముగా పార్శీ ఆటగాండ్ర జట్టు 1888లో ఇంగ్లండు నకు ప్రయాణమై వెళ్ళుట సంభవించెను. ఇంగ్లండులో వీరు కొన్ని క్రికెట్ పం దెములలో గెల్చుటయు, కొన్నిటి యందోడుటయు, మరికొన్నిటియందు ప్రత్యర్థులతో సమ ఉజ్జీలగుటయు సంభవించినది. విక్టోరియా రాణి ఆహ్వా నముపై 'కంబర్ లాండ్ లాడ్జి' వద్ద 'క్రిస్టియన్ విక్టర్స్' అను పదునొకండు మందిగల ఆటజట్టుతో పం మాడు భాగ్యము వీరి కబ్బినది. రెండేండ్ల అనంతరము, ఈ పార్శీ జట్టువారు రెండవసారి ఇంగ్లండునందు సంచారము చేసి కొన్ని పందెములలో ఘనమైన విజయములు సాధించిరి. ఈ క్రికెట్ ఆటలయాత్రలను ఏర్పాటు చేయుటయందును, వీటిని నిర్వహించుటయందును ఎ. బి. పటేల్, బారియా, ప్రేమ పటేల్ ప్రభృతులు ప్రధానమయిన పాత్రము వహించిరి.

హిందూయువకులుగూడ ఈ యాటయందు అభి రుచిని, అభిని వేళమును సంపాదించి 1878 వ సం॥లో హిందూ క్రికెట్ క్లబ్బును స్థాపించుకొనిరి. అట్లే మహమ్మ దీయులు గూడ తమ క్లబ్బును 1893 సం॥లో ఏర్పరచు కొనిరి. తరువాత కొలది సంవత్సరములలో వేర్వేరు 'జింఖానాలు' (క్రీడాసంస్థలు) వెలసినవి. 20వ శతాబ్ది ప్రారంభమున క్రికెట్ ఆట చెన్నరాష్ట్రములో గణనీయ మైన ప్రజాదరము పొందెను. ఐరోపియనులు, పార్శీలు, హిందువులు అను త్రివర్గములమధ్య(Triangular Tour- naments) జరిగిన ఆట పందెములవలనను, అటుపిమ్మట వీరిని మహమ్మదీయుల జట్టు కలియగా అప్పుడు చతుర్వర్గ ములమధ్య జరిగిన ఆటల (Quadrangular Tourna-