కోటప్పకొండ
సంగ్రహ ఆంధ్ర
రాజ్యముల తోడను సఖ్యమును పాటించుచు సంప్రదాయ సిద్ధమైన కోటవారి బిరుదావళిని ధరించి రాజ్యములో అంతఃక లహములు, సాంఘిక వైషమ్యములు లేకుండ శాంతి భద్రతలు నెలకొల్పి 'సర్వేజనాః సుఖినోభవంతు' అను సూత్రమును ఆధారము చేసికొని క్రీ. శ. 1264 వరకు గణపాంబ పరిపాలన చేసెను. దక్షతకలిగిన రాణిగానే కాక, దైవభక్తి కలిగిన ఉత్తమ ధర్మ పరాయణగా గూడ గణపాంబ ఖ్యాతి గడించెను. దీనికి అన్ని మతములవారిని సమాన దృష్టితో చూచుచు ఈమె స్వయముగా చేసిన దానధర్మములు, ఈ మెకు పుణ్యముగా ఈమె ఆశ్రితవర్గములోనివారు చేసిన దాన ధర్మములు చక్కని తార్కాణములు. క్రీ.శ. 1258 లో ఉత్తరాయణ సంక్రాంతి పుణ్యకాలమున గణపాంబ, తనతండ్రి గణపతిదేవునకు పుణ్యముగా నేటి మాదల గ్రామములోని దేవాలయ పిరిచారకుల వద్దనుండి ప్రభుత్వ మునకు రావలసిన ఆయ సుంకమును గద్దు చేసినట్లు ఒక శాసనములో చెప్పబడియున్నది. క్రీ. శ. 1261 సం. లో ఈ మాదల గ్రామములోని సక లేశ్వర మహాదేవునిగుడిలో అఖండదీపమునకు ఏబదిఅయిదు గొట్టెలను గణపాంబకు ధర్మముగా ఈమె ఆశ్రితవర్గములోని వాడైన మన్మ బోయడు దానముచేసినట్లు మరియొక శాసనములో చెప్ప బడినది. ఈ సంవత్సరములోనే తన భర్త బేతరాజు ఎన మదలలో కట్టించిన గోపీనాథ దేవాలయమునకు ఒక నూనెగానుగను ఈమె దానము చేసెను. ఈ సందర్భము లోనే ఈమె ఎనమదలలో పెండ్లిసుంకమువలన వచ్చు ఆదాయమును విద్యావంతులకు దానముచేయగా వారు ఆ ధనమును గణపమ దేవికి పుణ్యముగా గోపినాథ దేవా లయమునకు దానమిచ్చిరి. నానా దేశములకు చెందిన అనేక వర్తక సంఘముల సభ్యులుగూడ గణపమదేవికి పుణ్యముగా " గోపీనాథ దేవాలయమునకు తాము వ్యాపారముచేయు వివిధ వస్తువుల విలువలో కొంత భాగమును దానము చేసిరి. ఈ విధముగా దక్షతతో జయప్రదముగా రాజ్య పరి పాలన సాగించి, కోట గణపాంబ శాశ్వతమైన కీర్తిని ఆర్జించెను. ఈమె పరిపాలన అన్ని విధములచే ఈ మెసోదరి, కాకతీయ చక్రవర్తిని రుద్రాంబ పరిపాలనను జ్ఞప్తికి
తెచ్చుచున్నది. ఆంధ్ర ప్రదేశమును పరిపాలించిన స్త్రీలలో కోట గణపాంబకు ఒక మాననీయమైన స్థానము కలదని నిస్సందేహముగా చెప్పవచ్చును. ఆర్. న. రా. కోటప్పకొండ : ఆంధ్రదేశమున గల ప్రసిద్ధ పురాతన శైవ క్షేత్రము లలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరుజిల్లాలోని నరసరావు పేట తాలూకాలో, నరసరావుపేట పట్టణము నకు దక్షిణపు దిక్కున 7 మైళ్ళ దూరములో ఎల్లమంద, కొండకావూరు అను గ్రామములకు మధ్యనగల ఒక పర్వ తముపై నున్న పుణ్యక్షేత్రము ఇది యీ జిల్లాకు నడి బొడ్డులో నున్నది. ఈ పర్వత మెటు చూచినను మూడు కూటములు (బోళ్ళు) గా కన్పడుటచే, దీనిని త్రికూట పర్వత మనియు, ఇందు వెలసిన స్వామిని త్రికూ టేశ్వరు డనియు పిలుచుచున్నారు. ఈ స్వామినే ఎల్లమంద కోటి శ్వరు డనియు, కావూరి త్రికోటీశ్వరు డనియు భక్తులు పిలుచుచుందురు. ఈ పర్వతము చుట్టుకొలత అడుగు తక్కువ ఆమడ. దీని వైశాల్యము రమారమి 15 లేక 16 క రములుండును. దీని ఎత్తుగూడ సుమారు 1600 అడు గులు. ప్రస్తుతము ప్రజలందరును పూజించుచుండు కొత్త కోటీశ్వరస్వామి దేవాలయము ఆరువందల అడుగుల ఎత్తున నున్నది. దీనికి అనతిదూరములో పాతకోటీశ్వర స్వామి దేవాలయమున్నది. ఈ పర్వతము పైన పెద్ద అడవి యున్నది. అనేక గుహ లున్నవి. వీనిలో పూర్వకాలము నుండియు అనేక మంది ఋషులును, జంగములును తపస్సు చేసికొని ము క్తి ని బొందినట్లు ప్రతీతిగలదు. ఈ పర్వతము పైన ప్రకృతిసిద్ధ మైన అనేక నీటిదొన లున్నవి. అవన్నియు నిర్మల జలపూరితములు . మ్రొక్కుబడులు గల భక్తులు ఈ పర్వతము చుట్టును ప్రదక్షిణము చేసి, దక్షిణభాగ మందున్న 'ఓంకార' లేక ఓగేరు అను నదియందు స్నానమాడి, తీర్థ శ్రాద్ధములు చేసికొని కొండపైకి పోయి మ్రొక్కుబడులు చెల్లించి స్వామిని సేవించి తరింతురు.
కొండ పైకి పోవుటకు మార్గములు : ఈస్వామి సన్నిధికి పోవుటకు మూడు మార్గములు కలవు. (1) ఎల్ల మంద లా
96