విజ్ఞానకోశము .3 . కొలంబియా
1493 అక్టోబరులో కొలంబసు రెండవ పర్యాయము
సముద్రయానము చేసెను. ఈ పర్యాయ మతనికి 17
ఓడలు లభించెను. 1500 మంది నావికులు స్వచ్ఛందముగా
వచ్చిరి. కొలంబసు కొంతదూరము ప్రయాణము చేసిన
పిదప తన అనుచరులను 'హిస్పానియోల' ద్వీపమున
(దీనిని ఇప్పుడు హెయిటీ దీవి అందురు) దింపి తాను
క్రొత్త ప్రదేశములను కనుగొనుటకు వెళ్ళెను. గ్రేటర్
ఆంటిలీస్ అని నేడు పిలువబడు దీవుల పెక్కింటి నాతడు
కనుగొ నెను. సంవత్సర మైన పిదప తిరిగి హిస్పానియోలను
చేరుకొ నెను. కాని అచ్చట అతడు దింపిన అనుచరులు
బంగారముమీద పేరాసతో మూర్ఖముగా స్థానిక ప్రజ
లతో కలహించుటచేత వారిచే వధింపబడిరి. కొలంబసు
తిరిగి స్పెయినుకు వెళ్ళెను.
వాటి కాతడు
1498వ సంవత్సరమున కొలంబసు తన మూడవ
సముద్రయానమును సాగించెను. ఈ పర్యాయ మాతడు
ఆరు ఓడలతో బయలుదేరెను. ఈమారు ఆతడు నైరృతి
దిక్కున ఇంకను దూరముగాపోయెను. మార్గ మధ్యమున
మూడు ద్వీపములను కనుగొనెను.
ట్రినిడాడ్ అని పేరు పెట్టెను. పిమ్మట దక్షిణ అమెరికా
సముద్రతీరము ననుసరించి 'ఓరినోకో' నదీ ముఖము
వరకు నాతడు ప్రయాణము చేసెను. ఈమధ్య అతడు
ఎచ్చటను భూమి పై దిగుటకు వీలుపడలేదు. అతడు
చూచిన నదీముఖమునుండి నీరు పుష్కలముగా సముద్ర
ములో పడుచుండెను. కాబట్టి అదియొక ద్వీపమునుండి
పారు నది కాదనియు, ఒక పెద్ద భూఖండమునుండి
మాత్రమే అంతటి నది ప్రవహించగలదనియు కొలంబసు
గ్రహించెను. తానొక క్రొత్త ఖండమును కనుగొన్నట్లు
ఆత దూహించ దొడగెను. కొలదిరోజులలో నే కొలంబసు
'పారా'అఖాతమున ఒకచోట దక్షిణ అమెరికాలో దిగెను.
అది ఇండియాయే అని కొలంబసు ఊహించెను. కాని అది
ఇండియా కాదు. అమెరికా అనునొక క్రొత్తఖండము.
1502వ సంవత్సరమున కొలంబను తన తుది సముద్ర
యానమునకు బయలుదేరెను. మొదట నాతడు పశ్చిమ
ఇండీసు వై పుగా ప్రయాణము సాగించెను. ఆ తరువాత
జమైకా వెళ్లి నేడు 'హండూరాస్' ఉన్న తావున మధ్య
అమెరికా తీరమునకు చేరెను.
1504 వ సంవత్సరమున కొలంబసు స్పెయిను చేరు కొ నెను. మార్గమధ్యములో అతడెన్నో అవమానములకు, కష్టములకు గురియయ్యెను. అతడు స్పెయిను చేరుకొను సరికి దురదృష్టవశాత్తు ఇసబెల్లా రాణి మిక్కిలి అస్వస్థ తలో నుండి అతనికి దర్శన మియ్యలేకపోయెను. కొలం బసు కూడ జబ్బు పడెను. రాణి చనిపోయెను. కొలం బసుకు స్వస్థత చిక్కిన తరువాత అతడు ఫెర్డినాండు రాజును సందర్శించ బోయెను కాని రాజు కొలంబసును అభిమానించి ఆదరించలేదు. కొలంబసువలన ఇక ప్రయో జన మేమియని రాజు భావించి ఉపేక వహించెననికూడ కొందరు చెప్పుదురు. ఏమైనను ఆదరించువారు లేక కొలంబసు నిరు పేదయై, అనేక కష్టములకు లోనై, మరల అస్వస్థుడయి 1506లో పరలోక గతుడయ్యెను. నూత్న ప్రపంచమని చెప్పబడు అమెరికా ఖండమును కనుగొన్న మహాపురుషుడు కొలంబసు. అమెరికా ఖండ మును కనుగొని, స్పెయిను దేశమునకు యూరపు ఖండ ములో అతడు గొప్ప గౌరవ, ప్రతిష్ఠలు చేకూర్చి పెట్టెను. స్పెయిను దేశపు మహాపురుషులలో అతడొకడు. ప్రపంచ చరిత్రలో ఘనకార్యములను సాధించిన మహావ్యక్తులలో క్రిస్టొఫర్ కొలంబసు ఒకడుగా పరిగణింప బడుచున్నాడు. కొలంబియా : కొలంబియా ఒక ప్రజాస్వామిక రాజ్యము (Re- public). ఇది దక్షిణ అమెరికాలో వాయవ్య భాగమున నున్నది. దీనికి ఉత్తరమున కరిబ్బియన్ సముద్రము, తూర్పున బ్రెజిల్, వెనిజులా దేశములు, దక్షిణమున ఈక్వెడార్, పెరూ దేశములు, పశ్చిమమున పనామా, పసిఫిక్ మహాసముద్రములు ఎల్లలుగా నున్నవి. ఉత్తర దక్షిణములుగా దీని పొడవు 1050 మైళ్ళు. తూర్పు పడమరలుగా దీని వెడల్పు 860 మైళ్ళు. 4,39,829 చ. మై. దీని విస్తీర్ణము. ఇందు 1,21,08,000 మంది జనులు కలరు. (1953 జనాభా లెక్కలు) బొగోటా దీనికి ముఖ్యపట్టణము. ఇందు 6,45,000 మంది జనులు నివ సించు చున్నారు.
కొలంబియా యొక్క పశ్చిమ, మధ్యమ భాగములందు వ్యాపించిన పర్వతశ్రేణియొక్క నైసర్గిక లక్షణములు87