పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొరియాదేశము (భూగోళము) సంగ్రహ ఆంధ్ర


విస్తృతము చేయుటకును, నీటిపారుదల వసతులను అభి వృద్ధి చేయుటకును జపాను ప్రభుత్వము వారు, కొరి యాలో పెద్ద మొత్తముల ధనమును వ్యయపరచిరి. రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఏర్పడ్డ రసాయనపు టెరువుల కొరత వలనను, 1950 వ సంవత్సరము తరు వాత జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, దక్షిణ కొరి యాలో వ్యవసాయము నష్టపడెను. కాని యుద్ధవిరామ సంధి జరగిన పిమ్మట వ్యవసాయము పుంజుకొనెను. సుమారు 48,00,000 ల యొక రముల వి స్తీర్ణముగల భూమి కొరియాలో సాగుచేయబడుచున్నది. 28,50,000ల యెకరములలో మాగాణిపంటలును, 19,50,000ల యెక రములలో మెరక పంటలును పండింపబడుచున్నవి సగ టున కుటుంబమునకు 2- యెకరములును, ఒక్కొక్క వ్యక్తికి అరయెకరమును పడునని లెక్కలవలన అంచనా వేయబడినది. పర్వతములు, అరణ్యములు : కొరియా దేశము పర్వత మయమై యున్నది. పర్వతములనడుమ చిన్న చిన్న మైదానములు కలవు. పర్వతముల ఎత్తుకంటె వాటి విశేషసంఖ్యయే ఎక్కువ ఆశ్చర్యకరముగ నుండును. దేశముయొక్క మొత్తము విస్తీర్ణములో అయిదవవంతు ఆక్రమించియున్న మైదానముల యందును తీర ప్రదేశ ములయందును మూడుకోట్ల ప్రజలు కిక్కిరిసి నివసించు చున్నారు. కొరియా దేశమునకును మంచూరియా దేశ మునకును నడుమనున్న రెండు నదులును, ఒక కొండ వరుసయు ఉభయ దేశములకును సరిహద్దుగా నున్నది. దేశమునకు ఈశాన్యదిశగా ప్రవహించు ట్యుమెన్ అను నది మీదుగా కొరియాప్రజలు శతాబ్దములక్రితము నుండియు వలసపోయిరి. ఈ నదియొక్క 'హెడ్ వాటర్స్' నడుమ 9,000 అడుగుల ఎత్తుగల 'పాయిన్' అను పేరుతో ఒక అగ్నిపర్వతము కలదు. ఉత్తర సరిహద్దు ప్రాంతములో అధిక భాగము నిర్జన ప్రదేశమై యున్నది. కొరియా భూభాగములో, నూటికి 73 వంతులు అరణ్యప్రాంతమై యున్నది. 1953 వ సంవత్సరము నాటికి 1,57,25,000 ల యెక రముల మేరకు ఈఅరణ్యము లాక్ర మించి యుండెను. కాని 1943-50 సంవత్సరములనడుమ జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, విచక్షణ లేకుండా

అడవులను నరకి వేయుటవలనను, సమర్థమైన పర్యవేక్ష ణము లేకుండుటవలనను, అటవీసంపద నూటికి సగము వరకు క్షీణించెను. అడవులలో వంటచెరకును, గృహ నిర్మాణమునకు ఉపయోగపడు కలపసామగ్రియు లభ్య మగును. ఇవికాక దేవదారువు, స్ర్పూస్, లార్చ్ అను రమణీయమైన వృక్ష సంతతులును కాననగును. కొరియాలో చేపల పరిశ్రమ విరివిగా నున్నది. 10 లక్షలకు పైగా ప్రజలు ఈపరిశ్రమపై ఆధారపడి జీవించు కొరియనులు తమ ఆహార విషయమున చున్నారు. జంతు మాంసముపైకంటే చేపలపైననే అధికముగా ఆధారపడి యున్నారు. భౌగోళిక ముగను, జాతీయముగను కొరియనులు ఆసియా దేశ ప్రజలలో పెక్కురకంటే భిన్నులు. వారి ఆచార వ్యవహారములును, సంప్రదాయములును, వస్త్ర ధారణమును, భిన్నములుగనే ఉండును. వారిగృహములు మట్టి గోడలతో దృఢముగ నిర్మింపబడును. వంటశాలల నుండి బయలు దేరు పొగ, భూమి అడుగు భాగమున ఏర్పరచబడిన గొట్టముల ద్వారమున వ్యాపించి ఇల్లంతటి కిని వేడిమిని కలుగ జేయును కొరియా ప్రజలు అన్ని టను వ్యక్తిత్వముగల విశిష్ట జాతీయులుగా పరిగణింపబడి యున్నారు. పరిశ్రమలు: జపాను ప్రభుత్వమువారు తమ పరిపాలన కాలములో, కొరియాయందు పరిశ్రమలను అభివృద్ధి చెందనీయక అచ్చటినుండి ముడి సరకులను, తమ దేశమునకు దిగుమతి చేసికొనిరి. 1980 వరకు గృహోప కరణములు ఆహార పదార్థములు, గుడ్డలు మున్నగునవి మాత్రమే కొరియాలో ఉత్పత్తి అగుచుండెడివి. అనంత రము జపాను ప్రభుత్వమువారు కొరియా ప్రజల కోరి కను అనుసరించి ఉత్తర భాగమున ముఖ్యముగా భారీ పరిశ్రమలను నెలకొల్పి తమ స్వంత పారిశ్రామిక నిర్మా ణమునకు దోహద మొనరించుకొనిరి. ఈ భారీ పరిశ్రమలలో రాసాయనిక పదార్థములు, సిమెంటు, ఇనుము, ఉక్కు, విద్యుచ్ఛక్తి యంత్రముల ఉత్పత్తి ఉత్తర కొరియాలో అభివృద్ధి చెందుచుండగా, గుడ్డల పరిశ్రమ, ఆహార పదా ర్థముల పరిశ్రమ మాత్రమే దక్షిణ కొరియాలో స్థాపింప బడెను. కొరియా దేశములో బంగారము, రాగి, వెండి,

84