పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొరియాదేశము (చరిత్ర)


కొరియారాజు తన అధికారమును మరల స్థాపించుకొని, జపాను అధికారులను బర్తరఫ్చేసి, వారి స్థానమున రష్యా అధికారులను, రష్యా సైనిక అధ్యాపకులను నియమించెను. జపాను సామ్రాజ్యములో కొరియా విలీనము : కొరి యాలో తమ ప్రయోజనములను రక్షించుకొనుట కై జపాను రష్యా ప్రభుత్వములు కొరియాతో సమాధాన పడుటకు యత్నించెను. ఇరుదేశములును కొరియా స్వాతంత్ర్యమునుగుర్తించుటకును, ప్రత్యక్షముగకొరియా ఆంతరంగిక వ్యవహారములలో జోక్యము కలిగించుకొన కుండుటకును అంగీకరించినవి. కాని ఈ అంగీకారము తత్క్షణమే నిరర్థకమయ్యెను. రెండు దేశములును ఒండొంటిపై క్రీ. శ. 1904వ సంవత్సరములో యుద్ధము ప్రకటించు కొనెను. జపాను కొరియాపై బడెను. కొరియా ప్రభువు జపానుతో సంధి జేసికొనవలసివచ్చెను. ఈ సంధి ప్రకారము కొరియా స్వాతంత్ర్యము మరల గుర్తింపబడెను. కాని రష్యాపై యుద్ధ మాచరించుటకు అవసరమైన సైనిక కేంద్రములను కొరియాలో నిర్మించు కొనుటకు జపాను హక్కును సంపాదించెను. యుద్ధము విరమించక పూర్వమే, ఆర్థిక, సైనిక, పై దేశిక, న్యాయ శాఖల నిర్వహణమునకై తమ సలహాదారులను అంగీక రించునటుల జపాను ప్రభుత్వము కొరియాను కోరి కృత కృత్యతనొం దెను. అంతటితో ఆగక, కొరియాలోని తంతి, తపాలా, టెలిఫోను శాఖలనుగూడ జపాను స్వాధీన మొనర్చుకొనెను. అంత, రష్యా కిక్కురు మనకుండ, కొరియాలో జపాను చలాయించదలచిన సర్వాధికార మును గుర్తించెను. ఆ విధముననే అమెరికా, బ్రిటిష్ ప్రభుత్వములు గూడ అనుసరించెను. క్రీ.శ. 1905 వ సం॥ నవంబరులో కొరియాపై రక్షణాధి కారమును (Protectorate) జపాను లాంఛనప్రాయముగ స్థాపించు కొనెను. ఈ రక్షణాధికారము 5 సంవత్సరములు కొన సాగెను. అనంతరము జపాను కొరియా సైన్యమును విచ్ఛిన్నము చేసి, ఆ దేశమును తన సామ్రాజ్యములో 1910 వ సం॥లో కలుపుకొనెను. కొరియాను పాలించుటకై జపాను నిధిని నియమించెను. ఇతడు జపాను తన రాజప్రతి ప్రభుత్వమున కే

బాధ్యుడై యుండెను. ఇతని క్రింద వ్యవహరించు సలహా వర్గముగూడ జపాను నెడల భక్తి ప్రపత్తులతో మెలగ వలెను. ఉన్నత పదవులన్నియు జపానీయులే ఆక్రమించు కొని యుండిరి. చిల్లర ఉద్యోగములలో మాత్రమే కొరియనులు నియమింపబడిరి. ఈ విధముగ జపాను నిరంకుశముగ ప్రభుత్వము కొరియాను పశుబలముచే పాలించెను. జాతీయ చైతన్యము : తన పాలనములో జపాను ఎడ తెగక కొరియనుల ప్రతిఘటనమును ఎదుర్కొనవలసి వచ్చెను. ఈ ప్రతిఘటనమును జపాను తన సైనిక బల ముచే తెగటార్చి, వేలకొలది కొరియనులను హతమొన ర్చెను. ప్రథమప్రపంచ సంగ్రామా (1914-18) నంతరము వలసరాజ్య ప్రజలలో ఉవ్వెత్తుగా విజృంభించిన జాతీయ విప్లవ చైతన్యముచే, కొరియనులు ప్రభావితులైరి. దేశ భక్తి పరాయణులైన లక్షలాది కొరియనులు బ్రహ్మాండ మైన ప్రదర్శనములు జరిపిరి. వేలాది కొరియను ప్రదర్శ కులు జపాను తుపాకులకు గురియై ప్రాణములర్పించిరి, ఈ సంఘటనమునకు జపాను ప్రభుత్వము కలవరపడి. కొరియనులకు వాక్స్వాతంత్ర్యము, అధికారవి కేంద్రీకర ణము మున్నగు సంస్కరణములను ప్రవేశ పెట్టుటకు అంగీకరించెను. కాని వీటిలో కొన్నిటిని మాత్రమే అమలు జరి పెను. ఈలోగా కొరియాలోగల పెక్కు రాజకీయ పక్షములవారు ఐక్యమై క్రీ.శ. 1919 సం॥లో ఒక రహస్య ప్రదేశమున సమావేశమై చర్చలు జరిపిన పిమ్మట తాశ్చా లిక ప్రజాప్రభుత్వ స్థాపనమును గూర్చి ప్రకటన చేసిరి. అప్పుడే పారిస్ లో సమావేశమైన శాంతిమహాసభ చేతను, వాషింగ్టన్లో సమావేశమైన, ఆయుధవిసర్జన మహాసభ చేతను, నానాజాతి సమితిచేతను, తమ తాత్కాలిక ప్రభుత్వమును గుర్తింపజేయ యత్నించిరి. కాని జపాను తన పలుకుబడిని ఉపయోగించిన కారణముగా ఈ ప్రయ త్నములు విఫలములైనవి. అయినను, కొరియా జాతీయ వాదులు తమ పోరాటమును రెండవ ప్రపంచ సంగ్రా మమువరకు కొనసాగించుచునే యుండిరి. పెక్కురు జాతీయవాదులు అమెరికా, చైనా, మంచూరియా, సై బీరియా ప్రాంతములకు పలాయనమై అచ్చటినుండి గూడ తమ పోరాటమును సాగించిరి.

79