కొరియాదేశము (చరిత్ర) సంగ్రహ ఆంధ్ర
నగరమునకు కొనిపోబడిరి. తదాదిగా కొరియనులకును,
ఇతర ఐరోపా దేశములకు చెందిన పొగయోడల యజ
మానులకును అప్పుడప్పుడు సం బంధ ములుకలుగుచుండెను.
క్రీ. శ. 1830 లో మువ్వురు ఫ్రెంచి మతాధి కారులు
కొరియాలో అడుగిడి కొరియనుల చేతిలో మడసిరి.
శ. 1865 సం. నకు అనంతరము కొరియాతో వర్తకము
నెరపదలచిన పెక్కు దేశములతో దానికి సంబంధములు
మెండయ్యెను. పెక్కు పర్యాయములు ఫ్రెంచి, అమె
రికా, జపాను నావికాదళములు, కొరియాతో తలప
డెను. క్రీ. శ. 1876లో తనతో ఒడంబడిక గావించు
కొనుటకై కొరియాపై జపాను ఒత్తిడిగావించెను. తత్ఫ
లితముగ రెండు దేశముల నడుమ దౌత్యసంబంధములు
(diplomatic relations) నెలకొనెను. క్రీ.శ. 1892 లో
కోరియాతో ఒడంబడిక చేసికొనిన మొదటి పాశ్చాత్య
రాజ్యము అమెరికాయే. వెనువెంటనే ఇతర పాశ్చాత్య
రాజ్యములు కూడ కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబం
ధము లేర్పరచుకొ నెను. శ. 1886 వ సం. నాటికి,
ఈశాన్య ఆసియాలో తమ ప్రయోజనములను సాధించు
కొనియున్న అన్ని రాజ్యములతోడను కొరియాకు సంబంధ
మేర
జపాను ప్రాబల్యము : పాశ్చాత్యనాగరికతతో సంపర్య
మేర్పడిన ఫలితముగా జపాను అభివృద్ధి చెందేనని విశ్వ
సించిన కొరియనులు, తాముకూడ అదేమార్గమును అను
సరింపదలచిరి. ప్రాచీన సంప్రదాయికులైన కొరియనులు
ఈ భావమును వ్యతిరేకింపగా, అభ్యుదయకాములై న
యువకులు
శ. 1882 వ, 1884వ సం లలో జపాను
సాయముతో కొరియా రాజరికము పై తిరుగబడిరి. ఈ
సందర్భమున కొందరు జపానీయులు మరణించిరి. అంతట
జపాను ప్రభుత్వము కొరియానుండి నష్ట పరిహారమును
కోరెను. క్రీ. శ. 1884 వ సం.లో జరిగిన తిరుగుబాటు
సందర్భమున కొరియా ప్రభుత్వము చైనా సహాయముతో
జపాను అధికారులను తన దేశమునుండి తరిమివై చెను.
జపానీయులు మరల కొరియాకు తిరిగివచ్చి మరొక సారి
నష్ట పరిహారముకొరకై సంఘర్షించిరి. చైనీయులును,
జపానీయులును ఎట్టెటో సమాధానపడి (టీంట్సిన్ ఒడం
బడిక 1885), ఇరు రాజ్యములవారు తమ సైన్యములను
కొరియానుండి మరలించివై చుట కంగీకరించిరి. ఈ ఒడం బడిక ప్రకారము కొరియాకు తన స్వంతసైన్యమును నిర్మించుకొను హక్కు గుర్తింపబడినది. ఆంతరంగిక కల్లోలము సంభవించునప్పుడు మాత్రమే, కొరియా కోరిక పై జపానుకును, చైనాకును కొరియాలో ప్రవే శించుటకు హక్కు ఇయ్యబడినది. కాని A తొమ్మిది సంవత్సరములవరకు మాత్రమే అమలునం ఈ ఒడంబడిక దుండెను. శ. 1894 సం.లో కొరియా యందలి ‘టోంఘుకులు' అను నొక మతవర్గము వారు విదేశీయుల జోక్యమును నిరసించి తిరుగబడిరి. ఈ మతవర్గము పేద ప్రజలనుండి ఉత్పన్న మైనది. జపాను సైన్యములు, చైనా సై న్యములు కొరియాలో ప్రవేశించకపూర్వమే కొరియా ప్రభుత్వము ఈ తిరుగుబాటును అణచివై చెను. కొరియా ప్రభుత్వ విధానములో కొన్ని సవరణలు ప్రవేశ పెట్టు విషయమున తాను సాయపడుటకై, చైనా అంగీకారమును జపాను ప్రభుత్వము కోరగా, చైనా అందుకు నిరాకరించెను. జపాను సేనలు సియోల్నందలి రాజభవనముపై దాడి జరపి వెనువెంటనే చైనాపై యుద్ధము ప్రకటించెను. యుద్ధము స్వల్పకాల మేసా గెను. నూతనమైన కొరియా ప్రభుత్వము జపాను సహకార ముతో చైనీయులను వెడల నడిపించెను. క్రీ.శ. 1895లో జరిగిన 'షి మొనో సెకీ' ఒడంబడిక ననుసరించి చైనా, జపానులు రెండును కొరియా స్వాతంత్ర్యమును గుర్తించి నవి. కాని అనతికాలముననే జపాను ఈ ఒడంబడికను ఉల్లంఘించి కొరియా ప్రభుత్వమునుండి విపరీ తాధి కార ములను సంపాదించుటకై దానిపై ప్రబలమైన ఒత్తిడి తెచ్చెను. కాని కొరియా అందులకు అంగీకరింపక నిలబడి ప్రతిఘటించెను. కొరియాలోనున్న జపాను రాయబారి కుట్రపన్ని ప్రతికూలురాలుగా నున్న కొరియా రాణిని క్రీ. శ. 1895 లో చంపించి, తమ కనుకూలమగు నూతన కొరియా మంత్రివర్గమును నియమించెను. నామమాత్ర మైన ఆ కొరియా మంత్రివర్గమును అడ్డమిడుకొని జపాను ప్రభుత్వము కొరియాను క్రీ. శ. 1896 వ సం. వరకు పాలించెను. కొరియారాజు తన అనుచర మంత్రి వర్గముతో రష్యా రాయబార కార్యాలయమునకు పలాయితు డయ్యెను. పిదప కొంతకాలమునకు ఈ 78 78