Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కొరియాదేశము (చరిత్ర)

వికసించెను ; సాహిత్యము, వివిధశాస్త్రములు త్వరిత గతిని వృద్ధిచెందెను. కొరియాయందు భాషగూడ దాదాపు ఏకీకరణ మొనరింపబడెను.

కోర్యో : 'సిల్లా' ప్రభుత్వ సేనానులలో నొకడగు 'వాంగన్' తిరుగబడగా, 'సిల్లా' రాజ్యాధినేత అతని బలాధిక్యతను గుర్తించి, క్రీ. శ. 918 సం. లో అతనికొక ప్రత్యేక స్వతంత్రరాజ్యమును ఏర్పరుపవలసి వచ్చెను. ఇప్పుడు 'సియోల్' నగర సమీపముననున్న 'కేసాంగ్' అను తావుననే ఈ స్వతంత్రరాజ్యముయొక్క రాజధాని వెలసి యుండెను. క్రీ. శ. 935 వ సం. లో 'సిల్లా' ప్రభుత్వమునకు చెందిన తుదిరాజన్యుడు తన అధికారమును పరిత్యజించగా, వాంగన్ ఆ రాజ్యస్థానములో 'కోర్యో' అను మరియొక నూతన రాజ్యమును నెలకొల్పెను. ఈ రాజ్యము క్రీ. శ. 1392 వ సం. వరకు నిలిచి యుండెను. 'కొరియా' యని పాశ్చాత్యులు గావించిన నామకరణము 'కోర్యో' నుండియే ఉత్పన్న మయ్యెను. 'వాంగ్' రాజవంశ కాలమున కోర్యోలో బౌద్ధమతము ప్రబలముగా ప్రచారమం దుండెను. ఆ కాలమున చైనాదేశముతో కొరియా సత్సంబంధములనే నెరపుచుండెను. ఇట్లుండగా క్రీ. శ. 1231 లో మంగోలులు కోర్యోపై దండెత్తివచ్చి, దేశమంతయు ఆక్రమించి, 1364 వ సం. వరకు తమ అధీనమున ఉంచుకొనిరి. అదే సంవత్సరమున జనరల్ 'ఇ-టెయిజో' అను నాతని నాయకత్వమున కొరియా సైన్యములు మంగోలు మూకలను ఓడించి దేశమునుండి తరిమి వైచెను.

చోసన్ జనరల్ ఇ-టెయిజో, వాంగ్ వంశపు తుది రాజును క్రీ. శ. 1392 లో పదభ్రష్టుని గావించి, తనవంశమును రాజ్యాధికారమున నెలకొల్పెను. క్రీ. శ. 1910వ సం. లో కొరియాను జపాను ప్రభుత్వము తన రాజ్యములో కలిపివేసికొనువరకు ఈ వంశమే కొరియాలో అధికారమును నెరపెను. చైనాయొక్క 'మింగ్ ' వంశసార్వభౌముడు 'ఇ' అను పై పేర్కొన్న రాజవంశమును గుర్తించి కొరియాకు 'చోసన్' అను నూతన నామమిడెను. ఈ చోసన్ రాజ్యమునకు హాంగ్యాంగ్ (ప్రస్తుతము సియోల్) రాజధాని యయ్యెను. ఈ నూతన వంశపాలనమున కొరియా వైజ్ఞానికముగను, సాంస్కృతికముగను, అత్యంత వైభవము అనుభవించెను. ఈ కాలమున బౌద్ధమతము అణగ ద్రొక్కబడి, బౌద్ధమతాధికారుల క్రిందనున్న భూములు ప్రజలకు పంచి ఇయ్యబడెను. క్రీ. శ. 1403 సం. లో ప్రప్రథమముగా చైనా భాషకు సంబంధించిన అక్షరములను అచ్చొత్తించుట సంభవించెను. క్రీ. శ. 1420 లో ప్రభుత్వకళాశాల స్థాపింప బడెను. 'ఇ' రాజవంశము అధికారమును హస్తగత మొనరించుకొనిన మొదటి 150 సంవత్సరములలో కొరియాయందు విద్యావ్యాప్తి బహుళముగ జరిగి, వైద్యశాస్త్రమందును, ఖగోళశాస్త్రమందును, భూగర్భశాస్త్రమందును, వ్యవసాయశాస్త్ర మందును, చారిత్రక విషయములందును పెక్కురు విద్వాంసులు వెలసిరి.

క్రీ. శ. 16 వ శతాబ్దాంతమున ప్రప్రథమముగా కొరియా జపాను దండయాత్రకు గురియయ్యెను. క్రీ. శ. 1592 లో హిడెయోషి అను జపానీయుడు కొరియాను ఆక్రమించెను. ఏడుసంవత్సరముల సంఘర్షణ అనంతరము జపాను కొరియాను విడిచి వెళ్ళవలసివచ్చెను. క్రీ. శ. 1627 వ సంవత్సరములో మంచూ జాతీయులు, చైనాయందలి 'మింగ్' వంశమునకు ప్రమాదము తెచ్చి పెట్టిరి. వీరు కొరియా నాక్రమించి, కొరియా ప్రభువుచే, తమ సార్వభౌ మాధికారమును గుర్తింపజేసికొని కొంతకాలము రాజ్యమేలినపిమ్మట ఆదేశమును వీడి వెడలిరి. ఇట్లుండగా క్రీ. శ. 1644 వ సంవత్సరములో మంచూ జాతీయమైన 'చింగ్' వంశమువారు చైనా పాలితులుగ స్థిరపడిరి. వీరి సార్వభౌమాధికార మునకు లోబడి, కొరియా సామంతరాజ్యముగ మనవలసివచ్చెను. అయినను కొరియాయొక్క ఆంతరంగిక స్వేచ్ఛా స్వాతంత్య్రములలో చైనాప్రభుత్వము జోక్యము కలుగజేసుకొన కుండెను.

పాశ్చాత్యులతోడి సంపర్కము: క్రీ. శ. 1880 సం. వరకు కొరియా బాహ్యప్రపంచములో సంబంధములేక ఏకాకిగా జీవితమును గడుపుచుండెను. కొరియాకు పాశ్చాత్యులతో క్రీ. శ. 1653 వ సం. లో ప్రప్రథమముగా సంపర్కము కలిగెను. ఆ సంవత్సరమున ఒక డచ్చి పొగయోడ 'చెజు' ద్వీపమువద్ద భగ్నమయ్యెను. అందు బ్రతికి బయటపడిన 30 మంది ప్రయాణీకులు సియోల్

77